చేవెళ్లటౌన్, డిసెంబర్ 21 : మండలంలో ఏటేటా పత్తి సాగు గణనీయంగా పెరుగుతున్నది. గతేడాదితో పోల్చితే ఈసారి ఈ పంట సాగు బాగా పెరిగింది. ఈ ఏడాది 10,5 94 ఎకరాలకు పైగా పంటను రైతులు సాగు చేశారు. పత్తిని తీయడంలో జాగ్రత్తలు పాటి స్తే పత్తి బంగారంగా మారుతుందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నా రు.
వాతావరణం అనుకూలించక, అతివృష్టి, అనావృష్టితో ఇతర పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. దీంతో మండలంలోని చాలామంది రైతులు పత్తి పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. అయితే పత్తిని తీసే సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో మార్కెట్లో మద్దతు ధరను కోల్పోయే ప్రమాదం ఉన్నది.
ఎరువు వేసేముందు చేనులో కలుపు తీయాలి. మూడు, నాలుగు ఆకుల దశలో కలుపు ఉంటే ఎకరానికి 400 మిల్లీ లీటర్ల క్విజలోపాప్ ఈథైల్ (టర్గాసూపర్)+250 లీపైరిథియోబాగ్ సోడియం (హిట్బీడ్) కలిపి పిచికారీ చేయాలి. వరుస మొక్కల దగ్గర ఉన్న కలుపును కూలీలతో తీయించాలి. ఎండు తెగులు ఆశించిన మొక్క వేరును నిలువుగా చీల్చి చూ స్తే లోపల ఎర్రటి చారలు కనిపిస్తే పంటకు ఎండు తెగులు ఆశించినట్లు భావించాలి. తొలి దశలో ఎర్రటి చారలు కనిపించకపోవచ్చు.
వాడిపోయినట్లు కనిపించగానే నివారణ చర్యలు తీసుకోవాలి. పత్తి పంట రసం పీల్చే పురుగులైన పచ్చదోమ, తామెర పురుగులు ఆశిస్తే వాటి నియంత్రణకు కాండం పూత పద్ధతిలో ఒకసారి మోనోక్రోటోఫాస్ను నీటిలో కలిపి మొక్క కాండంపై ..మధ్య భాగంలో రెండు అంగుళాల పొడవునా ఒకవైపు మాత్రమే పూయాలి. కాండంపై సులభంగా పూసేందుకు చిన్న పరికరాన్ని లేదా బ్రష్ను ఉపయోగించాలి.
పత్తి బాగా విప్పుకున్న కాయ నుంచి మాత్రమే పత్తిని తీయాలి. కొద్దిగా విప్పిన కాయ నుంచి పత్తి తీయకూడదు. పత్తి తీసే సమయంలో ఆకులు చేతికి అంటకుండా జాగ్రత్తలు పాటించాలి. తీసిన పత్తిని నీడలో ఆరబెట్టి గాలి తగిలేలా నిల్వ చేయాలి. తేమ తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుత సమయంలో మంచు ఎక్కువగా కురుస్తుండడంతో మంచు తగ్గిన తర్వాత అంటే మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల్లోపు పత్తిని తీయాలి. ఎక్కువ వేడి ఉన్నప్పుడు పత్తిని తీస్తే గుల్లల వద్ద తొడిమెలు, ఆకులు పత్తికి అంటుకుంటాయి. పత్తిని తీసిన వెంటనే నీడలో వేయాలి.
ఇలా చేస్తే తేమ తగ్గి పత్తి నాణ్యతగా ఉంటుంది. నీడలో కుప్పగా వేస్తే పత్తిలో ఉన్న తేమ, వేడి ఎక్కువై గింజలు ముడతపడి తూకంలో బరువు తగ్గడమే కాకుండా ముక్కపురుగు తగిలి నాణ్యత కూడా దెబ్బతింటుంది. రైతులు పత్తి పంటను సాగు చేసే సమయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో తీసే సమయంలోనూ అంతే జాగ్రత్తగా ఉండాలి. వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తే పత్తి తేమ తగ్గి విక్రయించే సమయంలో నూ నాణ్యతగా ఉండి అధిక ధర వచ్చే అవకాశం ఉంటుంది.
రైతులు పత్తి పంటను సాగు చేసే సమయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో తీసే సమయంలోనూ అంతే జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుత సమయంలో మంచు అధికంగా కురుస్తుండడంతో మంచు తగ్గిన తర్వాత పత్తిని తీయాలి. వేడి అధికంగా ఉన్నప్పుడు పత్తిని తీస్తే వెంటనే నీడలో వేయాలి. ఇలా చేస్తే తేమ తగ్గి పత్తి నాణ్యతగా ఉంటుంది. పత్తి విప్పిన 5 నుంచి 6 రోజులో పత్తిని తీయాలి. లేకపోతే తేమ ఎక్కువై సూటిమోల్డ్ వచ్చే అవకాశం ఉన్నది. రైతులు తప్పనిసరిగా వ్యవసాయ శాఖ అధికారుల సూచనలను పాటించాలి.
-రమాదేవి, చేవెళ్ల ఏడీఏ