షాద్నగర్ : రోజు రోజుకు వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారి పట్ల అందరూ మరింత అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ దామోదర్ సూచించారు. ఫరూఖ్నగర్ మండలం బూర్గుల ప్రాథమిక ఆరోగ్య పరిధిలోని రాయికల్ టోల్ప్లాజాలో శనివారం కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టోల్ప్లాజా మేనేజర్కు కరోనా పాజిటివ్ రావడంతో ప్లాజాలోని ఉద్యోగులకు, సిబ్బంది మొత్తం 113మందికి పరీక్షలు నిర్వహించగా అందులో ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపారు. అదే విధంగా షాద్నగర్ డివిజన్లో 387 రాపిడ్ పరీక్షలు నిర్వహించగా అందులో 6మందికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. అందులో షాద్నగర్లో 5మందికి, కొత్తూరులో ఒకరికి వచ్చినట్లు తెలిపారు.
కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అందరూ మరింత అప్రమత్తంగా ఉంటూ మాస్క్లు ధరించడంతో పాటు భౌతిక దూరాన్ని పాటించాలని సూచించారు. ఎప్పుటికప్పుడు చేతులను శుభ్రంగా కడుక్కోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా ఆఫీసర్ నరహరి, హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాస్, ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది వెంకటముని, రెడ్డినాయక్, రమేశ్, స్వప్న, టోల్ప్లాజా ప్రాజెక్ట్ మేనేజర్ ఇబ్రహీం, సిబ్బంది పాల్గొన్నారు.