శంకర్ సెప్టెంబర్ 3 : చేవెళ్ల నియోజకవర్గంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. ఆదివారం శంకర్పల్లి మండలంలోని మహలింగాపూరం నుంచి తోపుగొండ వెళ్లే మెటల్ రోడ్డుకు 10 లక్షలు, సంగడు బావుల దారిలో వంతెన నిర్మాణానికి 5 లక్షల రూపాయాలు మంజూరు చేయాలని మహలింగాపూరం గ్రామస్తులు ఎమ్మెల్యే యాదయ్యకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయిస్తానని హమీ ఇచ్చారు.
ప్రభుత్వ సహకారంతో ఇప్పటికే నియోజక వర్గ పరిధిలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. అన్ని గ్రామాలు సంక్షేమ పలాలతో కళకళలాడుతున్నాయని చెప్పారు. రాష్ర్టాన్ని ఇంత అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్కు ప్రజలు అండగా ఉండి మరోసారి అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాణిక్ యాదగిరి, నాయకులు గోపాల్ చంద్రయ్య, చంద్రశేఖర్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.