షాబాద్ : వివిధ రకాల టెక్నాలజీలతో రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు పంచాయతీరాజ్ ఇంజీనీర్ ఇన్ చీఫ్ సంజీవ్రావు అన్నారు. భారత ప్రభుత్వ ఆదేశానుసారం శనివారం రంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలోని మీటింగ్ హాల్లో ఇండియా-75 ఆజాదీకా అమృత్ మహాత్సమ్ అనే అంశంపై సేమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ పీఎంజీఎస్వై రోడ్లలో వివిధ రకాల టెక్నాలజీలతో పలు రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ విధంగా నిర్మించే రోడ్ల నిర్మాణంతో ఖర్చు కూడా తగ్గుతుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రంగారెడ్డిజిల్లా రీజినల్ ఆఫీసర్ సురేశ్చంద్రారెడ్డి, స్పీకర్ శ్రీనివాస్, టెక్నికల్ కన్సల్టెంట్ మల్లయ్య, సిబ్బంది పాల్గొన్నారు.