కంటోన్మెంట్, ఏప్రిల్ 21 : బీఆర్ఎస్తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఇన్చార్జి రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు. ఆదివారం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో రసూల్పురాకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు.
వారికి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఇన్చార్జి రావుల శ్రీధర్ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అజేయ శక్తిగా దూసుకెళ్తుందన్నారు. ఎవరెన్ని మాటలు చెప్పినా కంటోన్మెంట్ ప్రజలు బీఆర్ఎస్ వెంటే ఉన్నారని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత గెలుపు ఖాయమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో షేక్ మహ్మద్, దావూద్ ఖాన్, ఆసిఫ్, అక్రమ్, జాఫర్, సిరాజ్, రమేశ్, సలీం తదితరులు పాల్గొన్నారు.