ఆమనగల్లు : రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ను శనివారం ఆమనగల్లు బ్లాక్ మండలాల నేతలు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్యాదవ్తో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నియోజకవర్గలకు సంబంధించి అభివృద్ధి కోసం నిధులు విడుదల చేయాలని ఆయనకు విన్నవించారు.
మంత్రిని కలిసిన వారిలో రాష్ట్ర టీఆర్ఎస్ నాయకులు గోలి శ్రీనివాస్రెడ్డి, వైస్ ఎంపీపీ అనంతరెడ్డి, జడ్పీటీసీ విజీతారెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు లక్ష్మినరసింహరెడ్డి, రమేశ్రెడ్డి, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు జైపాల్రెడ్డి, పవన్కుమార్ రెడ్డి, మాజీ ఎంపీపీ జైపాల్నాయక్ పాల్గొన్నారు.
గవర్నర్ తమిళిసైకు శుభాకాంక్షలు తెలిపిన నాయకులు
రాష్ట్ర గవర్నర్ తమిళిసైని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి, మండల వైస్ ఎంపీపీ అనంతరెడ్డిలు మర్యాదపూర్వకంగా కలిశారు. కొత్త ఏడాది పురస్కరించుకుని ఆమెకు పుష్పగుచ్ఛం సమర్పించి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.