పహాడీషరీఫ్, ఏప్రిల్ 12 : పేదలకు ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసే రేషన్ బియ్యాన్ని ఓ గోడౌన్లో నిల్వ చేసిన 84 టన్నుల రేషన్ బియ్యాన్ని ఎస్.ఓ.టీ పోలీసులు సీజ్ చేశారు. ఈ సం ఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్.ఓ.టీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే రేషన్ బియ్యాన్ని కొంత మంది వ్యక్తులు బాలాపూర్ మండల పరిధిలోని పలు ప్రాంతాలలో తక్కువ ధరకు కొనుగోలు చేసి జల్పల్లి కమాన్ సమీపంలో ఓ గోడౌన్లో నిల్వ ఉంచారు. అక్కడి నుంచి గుట్టు చప్పుడు కాకుండా ఇతర రాష్ర్టాలకు తరలించి ఎక్కువ ధరకు విక్రయించి అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారు.
విశ్వసనీయ సమాచారం మేరకు మంగళవారం సాయంత్రం ఎల్బీనగర్ ఎస్.ఓ.టీ పోలీసులు దాడి చేసి పీడీఎస్ బియ్యం నిల్వలకు సంబంధించి నిల్వలను గుర్తించి నిల్వ ఉంచిన 84 టన్నుల బియ్యాన్ని సీజ్ చేశారు. వాటికి ఎలాంటి ఆధారాలు లేవని పోలీసులు తెలిపారు. సంఘటన స్థలంలో ఉన్న పాతబస్తీ రేయిన్ బజార్కు చెందిన సయ్యద్ నైమతుల్లా(50), బండ్లగూడ, చంద్రాయణగుట్టకు చెందిన సయ్యద్ సద్దాం(30) వ్యాపారస్తులు వారిని అదుపులోకి తీసుకుని వారి నుంచి ఒక సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. పహాడీషరీఫ్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పహాడీషరీఫ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.