ఇబ్రహీంపట్నం, జనవరి 17 : ఎల్బీనగర్ నేషనల్ హైవే-65లోని మహవీర్ హరిణి వనస్థలి పార్క్ వద్ద 15/0 నుంచి 40/0 వరకు జరగాల్సిన జాతీయ రహదారి మరమ్మతుల కోసం ఆరు లైన్ల సర్వీసు రోడ్డు విస్తరణ సమస్యను పరిష్కరించడానికి సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ శశాంక సూచించారు.
బుధవారం రంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఎల్బీనగర్ నుంచి మల్కాపూర్ వరకు రోడ్డు విస్తరణ కోసం సంబంధిత అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డు విస్తరణను వేగవంతం చేసేందుకు ఆయా శాఖల అధికారులు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారి సుధాకర్రెడ్డి, జిల్లా జాతీయ రహదారి రోడ్లు, బిల్డింగ్స్ ఈఈ ధర్మారెడ్డి, జిల్లా సర్వే లాండ్ ఏడీ శ్రీనివాస్, ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి, తహసీల్దార్లు పాల్గొన్నారు.