వికారాబాద్, డిసెంబర్ 21 : యువత మత్తు ప దార్థాలకు బానిస కావొద్దని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. గంజాయి ఇతర మత్తు పదార్థాల సరఫరా జరగకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నా రు. గురువారం కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఎస్పీ కోటిరెడ్డితో కలిసి జిల్లాస్థాయి నార్కోటిక్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని వికారాబాద్, పరిగి, తాండూ రు ప్రాంతాల్లో గంజాయి సంస్కృతి కనిపిస్తున్నదని, దీనికి యువత అలవాటు పడితే పరిణామా లు తీవ్రంగా ఉంటాయని, దీన్ని మొగ్గలోనే తుం చేయాలన్నారు.
మాదకద్రవ్యాల కట్టడిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నదని గుర్తు చేశారు. మత్తు పదార్థాలకు ము ఖ్యంగా స్కూల్, కాలేజీ విద్యార్థులు ఆకర్షితుల య్యే అవకాశం ఉందని, విద్యా సంస్థల్లో డ్రగ్స్ కమిటీలను ఏర్పాటు చేసి వారానికోసారి సమావేశం నిర్వహించి విద్యార్థులకు అవగాహన క ల్పించాలన్నారు. ప్రతినెలా జిల్లా స్థాయిలో కూ డా సమావేశం నిర్వహించి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. విద్యా సంస్థలతో పాటు మహిళా సంఘాలు, లోకల్ బాడీలలో కూడా స మావేశాలు నిర్వహించి అవగాహన కల్పించి డ్రగ్స్ రహిత జిల్లాగా రూపొందించాలన్నారు.
ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ.. రైతులు తమ పం ట పొలాల్లో గంజాయి మొక్కలు పెంచకుండా వ్యవసాయ శాఖ అధికారులు పర్యవేక్షించాలన్నా రు. గంజాయి పెంచే రైతులకు ప్రభుత్వం నుంచి రైతుబంధు, రైతు బీమా తదితర పథకాలు అందవని వివరించాలని సూచించారు. జిల్లా సరిహ ద్దు ప్రాంతాల నుంచి మత్తు పదార్థాలు రాకుండా నిరోధించేందుకు గట్టి నిఘాను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా ఏర్పాటు తర్వాత నుంచి ఇప్పటివరకు 25 డ్రగ్స్ కేసులు నమోదు చేసి 128 మం దిపై చర్యలు తీసుకున్నామన్నారు.
క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా నిర్వహించే ఈవెంట్లలో మాదకద్రవ్యాలు వినియోగించరాదని సూచించా రు. జిల్లాలో డ్రగ్స్ను అరికట్టేందుకు పోలీసు, రె వెన్యూ ఫారెస్టు, ఎక్సైజ్, వ్యవసాయ శాఖలు సం యుక్తంగా పనిచేసి ఎలాంటి సమాచారం అంది నా వెంటనే పోలీసు శాఖకు తెలియపరచాలన్నా రు. సమావేశంలో అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ నారాయణ అమిత్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్ చంద్ర, ఫారెస్ట్ అధికారి జ్ఞానేశ్వర్, డీఈవో రేణుకాదేవి, ఉపవైద్యాధికారి జీవరాజ్, డ్రగ్స్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్, అగ్రికల్చర్, రెవెన్యూ, సంక్షే మ శాఖల సహాయ అధికారులు పాల్గొన్నారు.