తలకొండపల్లి : బాధిత కుటంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుంద ని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. తలకొండపల్లి మండలంలోని జూలపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ ఆనారోగ్యానికి గురయ్యారు. వైద్యం కోసం బాధితుని కుటుంబ సభ్యులు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డిని ఆశ్రయించారు. ఎమ్మెల్సీ బాధితుని కుటుంబ సభ్యుల చేత ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేయించారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి శ్రీకాంత్కు రూ. 36వేల విలువ గల చెక్కు మంజూరయ్యాయి. మంజూరైన చెక్కులను మంగళవారం బాధితుల కుటుంబ సభ్యులకు అందించారు.
అదే విధంగా కల్వకుర్తికి చెందిన సురేశ్ రూ. 2లక్షల చెక్కులు మంజూరయ్యాయి. మంజూరైన చెక్కులను బాధితులకు ఎమ్మెల్సీ అందజేశారు. కార్యక్రమంలో నాగర్కర్నూల్ జడ్పీవైస్ చైర్మన్ బాలాజీసింగ్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.