కడ్తాల్ : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం నిరుపేదలకు వరంలా మారిందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల కేంద్రానికి చెందిన కవితకి రూ. లక్ష సీఎంఆర్ఎఫ్ చెక్కు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో మంజూరైంది. గురువారం ఉదయం హైదరాబాద్లోని ఎమ్మెల్సీ నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారురాలికి ఎమ్మెల్సీ సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ పథకంతో నిరుపేదలకందరికీ మెరుగైన వైద్యం అందుతుందని తెలిపారు. ఈ పథకంతో సీఎం కేసీఆర్ ఎంతోమంది ఇండ్లలో వెలుగులు నింపారని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను చేయడం జరుగుతుందన్నారు. అనంతరం ఆమనగల్లు, కడ్తాల్, వెల్దండ, మాడ్గుల్ మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు సురేందర్రెడ్డి, గోపాల్రెడ్డి, భాస్కర్రెడ్డి, వేణుగోపాల్, కొండల్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, సుమన్, మల్లేశ్, లక్ష్మయ్య, రమేశ్ పాల్గొన్నారు.