కడ్తాల్ : పేదల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మాడ్గుల్ మండల కేంద్రానికి చెందిన సతీశ్కి రూ. 31వేలు, శాంతమ్మకి రూ. 24వేలు సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో మంజూరయ్యాయి. బుధవారం హైదరాబాద్లోని ఎమ్మెల్సీ నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు ఎమ్మెల్సీ సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ పథకంతో నిరుపేదలకు వరంలా మారిందని తెలిపారు. ఈ పథకంతో పేదలకందరికీ కార్పొరేట్ దవాఖానలో అత్యుత్తమ వైద్యం అందడంతో పాటు, ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపిదని పేర్కొన్నారు. సబ్బండ వర్గాల సంక్షేమానికి టీఆర్ఎస్ సర్కార్ అనేక పథకాలను అమలు చేస్తుందన్నారు.
అనంతరం ఆమనగల్లు, కడ్తాల్, వెల్దండ, మాడ్గుల్ మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డికి పుష్పగుచ్ఛాలు అందజేసి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంకటేశ్వర్లుగౌడ్, నాయకులు సురేందర్రెడ్డి, కొండల్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, రాజు, శ్రీకాంత్, శ్రీశైలం, మహేశ్, అమీర్ పాల్గొన్నారు.