కడ్తాల్ : నిరుపేదల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని రావిచేడ్ గ్రామానికి చెందిన అర్జున్కి రూ. 56వేలు, మాడ్గుల్ మండలానికి చెందిన అనసూయమ్మకి రూ. 2లక్షలు, ఆమనగల్లు మండలం మేడిగడ్డ తండాకి చెందిన రాజుకి 36వేల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు ఎమ్మెల్సీ సహకరంతో మంజూరయ్యాయి. గురువారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ఎంతోమంది పేదల జీవితాల్లో వెలుగులు నింపిందని తెలిపారు. కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని సీఎం కేసీఆర్ ఆదుకుంటున్నారని ఎమ్మెల్సీ వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ అనిత, పీఏసీఎస్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్, నాయకులు సురేందర్రెడ్డి, కొండల్రెడ్డి, విజయ్నాయక్, సుమన్గౌడ్, భీక్యానాయక్ పాల్గొన్నారు.