పరిగి : పరిగి పట్టణంలోని 5వ వార్డుకు చెందిన కృష్ణమూర్తిచారి అనారోగ్యంతో ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. దవాఖాన ఖర్చులు కోసం ఎల్వోసీకి ఎమ్మెల్యే సహకారంతో దరఖాస్తు చేసుకోగా చెక్కు మంజూరు అయింది. మంజూరైన రూ. 3లక్షలు ఎల్వోసీని ఎమ్మెల్యే మహేశ్రెడ్డి శుక్రవారం బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ప్రతి పేద వారికి కార్పొరేట్ ఆసుపత్రులలో వైద్యానికి సర్కారు తోడ్పాటు అందిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.
కార్యక్రమంలో ఎంపీపీ అరవిందరావు, మార్కెట్ చైర్మన్ సురేందర్, పీఏసీఎస్ చైర్మన్ కొప్పుల శ్యాంసుందర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అశోక్, సీనియర్ నాయకులు ప్రవీణ్కుమార్రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ భాస్కర్ పాల్గొన్నారు.