తాండూరు : తాండూరు నియోజకవర్గంకు చెందిన నలుగురు లబ్ధిదారులకు ఆదివారం ఎమ్మెల్యే రోహిత్రెడ్డి సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ. 5.40లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి సీఎం సహాయనిధి నిరుపేదలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందజేస్తామన్నారు.