యాలాల : సీఎం రీలీఫ్ ఫండ్ ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తం అందిస్తుందని ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి అన్నారు. యాలాల మండలం కమాల్పూర్ గ్రామ సర్పంచ్, సీనియర్ నాయకులు బస్వరాజ్ కుమారుడు ప్రశాంత్ అనారోగ్యానికి గురై హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వారి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డిని సంప్రదించగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. లక్ష 50వేలు మంజూరు చేయించారు. దానికి సంబంధించిన ఎల్వోసీని శుక్రవారం హైదరాబాద్లో బస్వరాజ్కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి కార్యకర్తను పార్టీ కడుపులో పెట్టుకొని కాపాడుకుంటుందన్నారు.
ముఖ్యమంత్రి సహాయనిధి అనేక మంది నిరుపేద కుటుంబాలను ఆదుకుంటుందన్నారు. భవిష్యత్లో కూడా నియోజకవర్గంలోని ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న నిరుపేదలకు అండగా ఉంటానన్నారు. అంతేకాకుండా వారికి కార్పొరేటు వైద్యం అందించడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ ఉన్నారు.