షాద్నగర్ రూరల్ : తెలంగాణ సర్కార్ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఇందులో భాగంగానే పట్టణానికి చెందిన ప్రశాంత్కు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ. 60వేల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం సహాయనిధి ద్వారా నిరుపేదలకు సైతం కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందుతుందనే విషయాన్ని అందరూ గ్రహించాలన్నారు. ఎవరూ ఊహించని విధంగా ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ సర్కార్ అని అన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రజా సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, కౌన్సిలర్లు జీటీ శ్రీనివాస్, సర్వర్పాషా, రాజు, గ్రంథాలయ డైరెక్టర్ గోపాల్, నాయకులు వంకాయల నారాయణరెడ్డి, మన్నె నారాయణ, పాల్గొన్నారు.