ఇబ్రహీంపట్నం/షాద్నగర్ జూన్ 8 : సీఎం కేసీఆర్ ప్రభుత్వం సంక్షేమ పాలన దిశగా సాగుతున్నది. గడపగడపకూ సంక్షేమ పథకా లు, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నది. కడుపులో బిడ్డ నుంచి పండు ముసలి వరకు సంక్షేమ పథకాలను అం దించి ఆదుకుంటున్నది. తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రం గారెడ్డి జిల్లాలోని ప్రతి ఇల్లూ కుల, మత, పార్టీలకతీతంగా సంక్షేమ పథకంతో లబ్ధి పొందాయి. దళితబంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, మైనార్టీల అభ్యున్నతి, చేతివృత్తుల వా రికి రూ.లక్ష రుణ సౌకర్యం, సంక్షేమ హాస్టళ్ల ద్వారా బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు బోధన, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, సీఎం సహాయనిధి, కేసీఆర్ కిట్లు, ఆసరా పింఛన్లు తదితర పథకాలను ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజలకు ఆదుకుంటున్నది. దళితబంధు పథకం కింద జిల్లాలో మొదటి విడుత లో 697 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం రుణాన్ని మంజూ రు చేసింది. ఒక్కో నియోజకవర్గం నుంచి వంద మంది చొప్పున మొదటి విడుతలో రూ.69.70కోట్ల ఆర్థిక సాయాన్ని అందించింది.
ఈ సాయం తో లబ్ధిదారులు ట్రాక్టర్లు, కార్లు, డెయిరీఫాంలు, టెంట్హౌజ్లు, సెంట్రింగ్ వంటి వాటిని కొనుగోలు చేసి ఆర్థికంగా వృద్ధి చెందుతూ మరో పది మందికి ఉపాధిని కల్పిస్తున్నారు. అలాగే రెండోవిడుతలో నియోజకవర్గానికి 2000 మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి రుణసదుపాయం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకంతో అట్టడుగు వర్గాల్లోని దళితులు ఆర్థికంగా అభివృద్ధి దిశలో పయనిస్తున్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా పేదింటి ఆడపిల్లల వివాహాల కోసం ఇప్పటికే ప్ర భుత్వం జిల్లాలో 25 వేల మందికి రూ.లక్షా116 అందించింది. అలాగే చేతివృత్తుల వారి సంక్షేమం కోసం ప్రభుత్వం కొత్త గా రూ. లక్ష అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియనూ ప్రారంభించింది. ముఖ్యమంత్రి సహాయనిధి కింద జిల్లాలో ఇప్పటివరకు యాభై వేల మందికి ఆర్థిక సాయాన్ని అందించి ఆదుకున్నది.అన్ని వర్గాల ప్రజలు సర్కారు సంక్షేమ పథకాలతో సంతోషపడుతున్నారు. అదేవిధంగా ఆసరా పింఛన్లు వృద్ధులకు ఆసరాగా నిలిచాయి. ఇటీవల జిల్లాలో సుమారు 50వేల మం దికి కొత్తగా ఆసరా పింఛన్లను ప్రభుత్వం మం జూరు చేసింది. పింఛన్ డబ్బులతో వృద్ధులు, వితంతులు ఆనందంగా జీవిస్తున్నారు.
సంక్షేమ వసతి గృహాలతో విద్య..
బడుగు, బలహీన వర్గాలు, షెడ్యూల్డ్ కులాలకు చెందిన అనేక మంది విద్యార్థినీవిద్యార్థుల కోసం ప్రభుత్వం 30నుంచి 40 వరకు సంక్షేమ వసతి గృహాలను ఏర్పా టు చేసింది. ఈ హాస్టళ్లలో వేలాది మంది విద్యార్థినీ విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన బోధనతోపాటు నోటుబుక్స్, పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, కాస్మెటిక్స్ వంటి ని ప్రభుత్వం అందిస్తున్నది.