పసిపాప నుంచి పండు ముసలోళ్ల వరకు, అన్ని వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. శనివారం కేశంపేట మండలం ఎక్లాస్ఖాన్పేటలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సకల జనుల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తూ.. ఇంటింటికీ ప్రభుత్వ పథకాలను అందిస్తున్నారన్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో కాంగ్రెస్, బీజేపీ నేతలు గప్పాలు కొడుతూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్, బీజేపీలకు చావుదెబ్బ తప్పదని హెచ్చరించారు.
-షాద్నగర్, మార్చి 25
షాద్నగర్, మార్చి 25: కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల పాలనలో ప్రజలకు ఏమి చేశారో చెప్పాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ఆ పార్టీల నాయకులను ప్రశ్నించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్ర మాలు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ అమల్లో లేవని.. సీఎం కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తున్నదని కొనియాడారు. శనివారం కేశంపేట మం డలం ఎక్లాస్ఖాన్పేట గ్రామంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
ఎంతసేపు బీఆర్ఎస్ ప్రభుత్వంపై, నాయకులపై ఏడవడం తప్పా కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ప్రజలకు ఏమి చేశాయో చెప్పాలని..ఎన్నికలు సమీపిస్తుం డటంతో ఉట్టి గప్పాలు కొడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆ పార్టీల నాయకులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రం ఏర్పడక ముందు ఎన్నో అవమానాలను భరించామన్నారు. రాష్ట్రం వస్తే భూముల ధరలు పడిపోతాయి.. కరెంట్ రాదు, నీళ్లు రావు అని అప్పటి పాలకులు భయభ్రాంతులకు గురిచేశారని.. కానీ నేడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వారి నోళ్లు మూ గబోయాయన్నారు. గత ప్రభుత్వాల హయాంలో సాగు, తాగునీరు దొరకని పరిస్థితి ఉండేదని.. కానీ, నేడు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ సురక్షిత తాగునీరు అందుతున్నదన్నారు.
రైతు పక్షపాతి సీఎం కేసీఆర్
రాష్ట్ర రైతుల శ్రేయస్సు కోసం 24 గంటల ఉచిత విద్యుత్తుతోపాటు రైతుబంధు, రైతుబీమా వంటి పలు పథకాలను ప్రవేశపెట్టి సీఎం కేసీఆర్ రైతు పక్షపాతిగా నిలిచారని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ కొనియాడారు. ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని.. సకల జనుల క్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదన్నా రు. గడిచిన ఎనిమిదేండ్లకాలంలో ప్రభుత్వం 1.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడంతోపాటు మరో 98 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తూ నిరుద్యోగులకు అం డగా నిలుస్తున్నదన్నారు.
ఐటీ, పరిశ్రమ శాఖల మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో మన ప్రాంతంలో ఎన్నో పరిశ్రమలు వెలుస్తున్నాయని.. వేలాది మంది యువతకు ఉపా ధి అవకాశాలు లభిస్తున్నాయన్నారు. పార్టీకి సేవ చేసే ప్రతి ఒక్కరికీ అండగా ఉంటానని.. సమస్యలుంటే తన దృష్టికి తీసుకొచ్చి.. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నాయకులు, కార్యకర్తలకు ఆయన సూచించారు. సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, జడ్పీటీసీ తాండ్ర విశాల, ఎంపీపీ రవీందర్యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వంకాయల నారాయణరెడ్డి, నాయకులు రాంబాల్నాయక్, నర్సింగరావు, మురళీధర్రెడ్డి, జమాల్ఖాన్, శ్రీశైలం, నవీన్, సురేందర్, వేణుగోపాల్, సుదర్శన్, ఆం జనేయులు, గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.