యాలాల, ఫిబ్రవరి 2 : గ్రామాల అభివృద్ధికి దిక్సూచిగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి అన్నారు. బుధవారం యాలాల మండల పరిధిలోని ముద్దాయిపేట్, కమాల్పూర్, నాగ సముంధర్, బానాపూర్, పగిడ్యాల, రాఘవాపూర్, బాగాయిపల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ఎంపీపీ బాలేశ్వరగుప్తా, మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్నాయక్, వైస్ ఎంపీపీ రమేశ్, పార్టీ మండల అధ్యక్షుడు మల్లారెడ్డిలతో కలసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళుతున్నామన్నారు. సీఎం కేసీఆర్ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. యాలాల మండల వ్యాప్తంగా ఒక కోటీ 21లక్షల 35వేల నిధులతో ఎనిమిది గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించామన్నారు. దానిలో భాగంగా ఎనిమిది సీసీ రోడ్లు, డ్రైన్లు, నాలుగు స్మశానవాటికలను ప్రారంభించుకున్నామన్నారు. అంతకుముందు బానాపూర్లో గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, నాయకులు రాజుగౌడ్, నర్సిరెడ్డి, గురురాజ్ జోషీ, రవీందర్రెడ్డి, శేఖర్రెడ్డి, డైరెక్టర్లు ఆశన్న, సప్తగిరిగౌడ్, సర్పంచులు కృష్ణయ్య గౌడ్, బసిరెడ్డి, కవిత, లక్ష్మీదేవి, బస్వరాజ్, శివకుమార్, మధుసూధన్ రెడ్డి, పటేల్ రెడ్డి ఎంపీటీసీలు గరివప్ప, రాములు, ప్రభాకర్ పాల్గొన్నారు.