గ్రామీణులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు, విద్యార్థులకు విద్యావకాశాలు కల్పించేందుకు జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇవ్వడమే కాదు.. అమలు చేసి చూపించారు. శుక్రవారం ఒక్కరోజే ఏకంగా 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించారు. వీటిలో భాగంగా వికారాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన కళాశాలలో కూడా తరగతులను సీఎం కేసీఆర్ వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా భూగర్బ గనులు, పౌర సంబంధాలు, సమాచార శాఖల మంత్రి పట్నం మహేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కలిసి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం కళాశాలలో లెక్చర్ హాళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నమస్తే తెలంగాణతో వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ సార్కు కృతజతలు తెలియజేశారు. కేసీఆర్ గారికి ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధతో పాటు విద్యార్థుల భవిత్యుత్తుపై స్పష్టమైన విజన్ ఉన్నదని కొనియాడారు. మెడికల్ కాలేజీల ఏర్పాటు ద్వారా స్పెషాలిటీ వైద్యసేవలు పేద ప్రజలకు చేరువ చేశారని పేర్కొన్నారు. తెలంగాణ విద్యార్థులకు వైద్యవిద్యను అందుబాటులోకి తెచ్చారని పలువురు సంతోషం వ్యక్తం చేశారు. రూ.లక్షలు పోసినా దొరకని సీట్లు ఇవాళ అందరికీ అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. పేదింటి బిడ్డలు కూడా ఎంబీబీఎస్ చదివి డాక్టర్ పట్టా పొందే అవకాశం కల్పించారని హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ ఊటీగా పేరుపొందిన వికారాబాద్ లోని వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు రావ డం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడి వాతా వరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. తొమ్మిది ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడం ఎంతో గొప్ప విషయం. వీటితో పేద విద్యార్థులు తక్కువ ఖర్చుతో మెడిసిన్ చదవడానికి అవకాశం కలిగింది. ఈ అవ కాశం కల్పించిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు.
– విశిష్ట, హైదరాబాద్
గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీటు రావడం గ్రేట్. తెలం గాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ కృషితో వైద్య కళాశాలలు పెరిగాయి. దీని ఫలితంగా విద్యార్థులు ఇతర రాష్ర్టాలకు వెళ్లి వైద్య విద్య అభ్యసించడం తప్పింది. మా కొడుకు సాయి ప్రణీత్ చౌహాన్కు వికారాబాద్ మెడికల్ కళాశాలలో సీటు వచ్చినందుకు ఎంతో సంతోషించాం. ప్రైవేటు కాలేజీల్లో లక్షల రూపాయలు ఖర్చు చేసే స్థోమత లేని వారికి ప్రభుత్వం వైద్య విద్యను అందుబాటులోకి తేవడం గొప్ప విషయం.
– మీరా రాథోడ్, జహీరాబాద్, సంగారెడ్డి జిల్లా
వికారాబాద్ మెడికల్ కళాశాలలో సీటు రావడం వ రంగా భావిస్తున్నా. ఏడాదిలో తొమ్మిది వైద్య కళాశా లలు ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం. మం చి వాతావరణంలో పేద విద్యార్థులు వైద్య విద్య అభ్యసించే అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్కు చాలా చాలా కృతజ్ఞతలు. ఇక్కడి వాతావరణం కూడా చాలా బాగుంది. కష్టపడి చదువుకుంటాం.
– అంబికాశ్రీత, విద్యార్థిని బీహెచ్ఎల్, హైదరాబాద్
మా అమ్మాయి శ్రీవిద్యకు వికారాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఫ్రీ సీటు రావడం చాలా సంతోషంగా ఉంది. ప్రైవేటులో వైద్య విద్య అభ్యసించాలంటే లక్షలు ఖర్చు చేయాలి. నీట్లో ఆలిండియాలో 1,39,000 ర్యాంకు వచ్చింది. మొదటి విడుత కౌన్సెలింగ్లో ప్రైవేటు కళాశా లలో సీటు వచ్చింది. కోర్సు పూర్తయ్యే వరకు రూ.50 లక్షల వరకు ఖర్చు వస్తుందని తెలిసింది. రెండో విడుత కౌన్సెలింగ్లో వికా రాబాద్ వైద్య కళాశాలలో సీటు వచ్చింది. చాలా సంతోష పడ్డాం. పేద మధ్య తరగతి వారికి ప్రభుత్వ కళాశాలలో సీటు రావడం సంతోషకరంగా ఉంది.
– గుర్రపంల్లి గాయత్రీదేవి, మహబూబ్నగర్
ప్రతి జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేయడం సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. ప్రభుత్వం చాలా మంచి నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయంతో ప్రతి జిల్లాకు వైద్య కళాశాల వచ్చింది. వైద్య విద్య చదువడానికి రాజస్థాన్ నుంచి వచ్చారు. ఇదంతా చూస్తే మన పిల్లలు తెలంగాణలో పుట్టడం అదృష్టంగా భావిస్తున్నా. మంచి తరుణం. విద్యార్థులకు మున్ముందు ఇంకా మంచి మంచి అవకాశాలు ఇస్తే బాగుంటుంది.
– డాక్టర్ సర్వేశ్వర్, బీహెచ్ఈఎల్, హైదరాబాద్
తెలంగాణలో ప్రతి జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేసినందుకు మా అమ్మాయికి వికారాబాద్ ప్రభుత్వ వై ద్య కళాశాలలో ఫ్రీ సీటు వచ్చింది. లేకపోతే ఎంబీబీఎస్ చదివే అవకాశం ఉండేది కాదు. ప్రైవేటులో చదవాలంటే రూ.లక్షలు ఖర్చవుతాయి. ప్రభుత్వం పేద విద్యార్థులకు ఎన్నో ప్రయోజనాలు కల్పిస్తున్నందుకు సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు.
– బాలపీరు, వనపర్తి