టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడంతో జాతీయ స్థాయిలో అన్ని వర్గాలు, ఆయా పార్టీల నుంచి మద్దతు లభిస్తున్నది. ముఖ్యంగా తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా అమలు కావాలంటే కేసీఆర్ నాయకత్వం దేశానికి ఎంతో అవసరమని పేర్కొంటున్నారు. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ మాదిరిగా భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం ఖాయమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దేశ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ రావడం శుభపరిణామమంటున్నారు. కేసీఆర్ రైతుల పక్షపాతి అని.. తెలంగాణలో రైతు బంధు, రైతు బీమా, ఉచిత కరెంట్, గిట్టుబాటు ధర, సబ్సిడీ ధరలకు విత్తనాలు, మందులు, రుణాలు వంటివి రైతులకు అందజేస్తున్నారు. కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావడం ద్వారా అన్ని వర్గాలవారు లబ్ధి పొందుతారని.. ముఖ్యంగా రైతులకు మేలు జరుగుతుందని రాష్ట్ర అన్నదాతలు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన తరుణంలో కేసీఆర్ దేశానికి సేవలందించడం ఎంతో ఆవశ్యకమని పేర్కొంటున్నారు.
దేశానికి శుభసూచకం – ఖదీర్, రైతు, చిట్టిగిద్ద
ఎంతో మంది త్యాగాలు చేస్తేనే సీఎం కేసీఆర్ ద్వారా తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి రాష్ట్ర ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా చెరగని ముద్ర వేసుకున్నారు. నేడు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి దేశ రాజకీయాల్లో కీలక మలుపు తీసుకురావడానికి ముందుకు వెళ్తున్న తరుణంలో మనందరం మద్దతుగా నిలుద్దాం. మన రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశవ్యాప్తం అవనున్నాయని మనందరం గర్వంగా చెప్పవచ్చు. అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పడం గొప్ప విషయం.
సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి – సంగమేశ్, రైతు, మర్పల్లి
రైతు పక్షపాతి సీఎం కేసీఆర్. రైతు బంధు, రైతు బీమా లాంటి ఎన్నో అద్భుత పథకాలకు రూపకల్పన చేసిన నాయకుడు. రైతు కష్టాలను తెలుసుకున్న వ్యక్తి కేసీఆర్. ఈ పథకాలు దేశవ్యాప్తంగా అమలు కావాలంటే కేసీఆర్కు మాత్రమే సాధ్యమవుతుంది. బీఆర్ఎస్ పార్టీని దేశ రైతులందరూ స్వాగతిస్తున్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు.
దేశ ప్రగతి కేసీఆర్తోనే సాధ్యం – రాశిక మల్లయ్య, రైతు, మాడ్గుల మండలం
దేశ ప్రగతి కేసీఆర్తోనే సాధ్యం. పోరాటం చేసి తెలంగాణ సాధించారు. అలాగే రాష్ట్రంలో రైతు బంధు, రైతు బీమా, ఉచిత కరెంట్, గిట్టుబాటు ధర, సబ్సిడీ ధరలకు విత్తనాలు, మందులు, రుణాలు వంటివి రైతులకు అందిస్తున్నారు. దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ వెళ్లడంద్వారా ప్రజలకు.. ముఖ్యంగా రైతులకు మేలు జరుగుతుంది. కేసీఆర్ను చూస్తే బీజేపీకి వణుకు పుడుతున్నది. దేశం బాగుపడాలంటే కేసీఆర్ ప్రధాని కావలసిందే.
ఈ పరిస్థితుల్లో కేసీఆర్ దేశానికి అవసరం – మాధవగౌడ్, రైతు, చేవెళ్ల
దేశంలో రైతులు మొదలుకొని అన్ని వర్గాలవారు అష్టకష్టాలు పడుతున్నారు. బీజేపీ సర్కార్ అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నది. దేశంలో ఉన్న పలు ప్రభుత్వరంగ సంస్థలను బీజేపీ ప్రభుత్వం తన అనుచరులకు కట్టబెడుతున్నది. మోదీ ప్రభుత్వం పరిపాలనలో పూర్తిగా విఫలమైంది. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. ఇలాంటి సమయంలో కేసీఆర్ దేశానికి అవసరం.
సీఎం కేసీఆర్తోనే దేశం బాగుపడుతుంది – నర్సింహులు, రైతు, తిర్మలాపూర్
సీఎం కేసీఆర్తోనే దేశం అభివృద్ధి చెందుతుంది. రాష్ర్టాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న కేసీఆర్ దేశాన్నీ అభివృద్ధి చేస్తారు. అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరుగుతుంది. కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లడం సబబు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రత్యేక పాత్రను పోషించి.. టీఆర్ఎస్ ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తిచేయడం కేసీఆర్కే సాధ్యమైంది.
భారత్ రాష్ట్ర సమితితో దేశంలో మార్పు సాధ్యం : కొత్తకుర్మ సత్తయ్య, డీసీసీబీ వైస్ చైర్మన్
సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావడం దేశంలోని పేద ప్రజలకు మంచి పరిణామం. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశం అంతటా అందజేస్తే పేదలలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవనం కొనసాగిస్తారు. భారత్ రాష్ట్ర సమితితో దేశంలో పెనుమార్పులు జరుగడం తథ్యం. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు జాతీయస్థాయిలో పోటీని ఇవ్వగల ఏకైక నేత సీఎం కేసీఆర్ మాత్రమే.
దేశంలో సరికొత్త మార్పునకు నాంది – టి.ఆంజనేయులుగౌడ్, అడ్వకేట్, షాద్నగర్
దేశంలో సరికొత్త మార్పునకు సీఎం కేసీఆర్ నాంది పలికారు. సంక్షేమం, అభివృద్ధిలో దేశానికే తెలంగాణను దిక్సూచిగా నిలిపారు. నిత్యం ప్రజల క్షేమం కోరే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో వెళ్లడం ద్వారా దేశంలో ఎవరూ ఊహించని మార్పులు జరుగుతాయి. మన రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశంలో ఎక్కడా లేవు. ప్రజల మన్ననలను పొందిన సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో రాణిస్తారు.
దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారు – సిరిపురం మల్లేశం, రైతు, జిన్నారం
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రత్యేక పాత్రను పోషించి.. టీఆర్ఎస్ ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేయడం సీఎం కేసీఆర్కే సాధ్యమైంది. 8 సంవత్సరాల పాలనలో సీఎం కేసీఆర్ అన్ని వర్గాలకు అన్ని విధాలుగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందించి తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత సీఎం కేసీఆర్ సారుకే దక్కుతుంది. నేడు తెలంగాణ పథకాలను ఇతర రాష్ర్టాల్లో అమలు చేయలేక చాలా పార్టీలు తర్జనభర్జన పడుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ద్వారా పథకాలు అమలవుతాయని దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారు.
దేశాన్ని అభివృద్ధి చేయడం కేసీఆర్కే సాధ్యం : మంగలి నర్సమ్మ, రైతు, కంకణాలపల్లి
రాష్ట్రంలో అన్ని వర్గాలకు సమానంగా అభివృద్ధి ఫలాలను అందించి దేశంలోనే తెలంగాణ రాష్ర్టాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కృషి చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కింది. రాష్ట్రంలో రూ.200 నుంచి 2016 వరకు పింఛన్లను అందించడం.. రైతులకు రైతు బీమా, రైతు బంధు, దళిత బంధు, 24 గంటల కరెంటు, మిషన్ భగీరథ తాగునీరు.. ఇలా అన్నింటిలో తెలంగాణ ముందుకు పోవడం రాష్ట్ర ప్రజల్లో సంతోషాన్ని నింపింది. తెలంగాణను చూసి దేశ ప్రజలందరికీ కేసీఆర్ పాలనా విధానం నచ్చింది. తెలంగాణలా దేశాన్ని అభివృద్ధి చేయడం కేసీఆర్కే సాధ్యమవుతుందని అభిప్రాయపడుతున్నారు.
దేశ ప్రజలకు మంచి పరిణామం – డాక్టర్ సంపత్కుమార్, తాండూరు
సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడం దేశ ప్రజలకు మంచి పరిణామం. ఒక వైద్యుడిగా నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో తెలంగాణలో టీఆర్ఎస్ను ఏర్పాటు చేసి ప్రత్యేక తెలంగాణను సాధించిన కేసీఆర్ బీఆర్ఎస్ దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించనున్నారు.
సీఎం కేసీఆర్ సేవలు దేశానికి అవసరం – సాప నరేశ్, హైకోర్ట్ న్యాయవాది, కడ్తాల్
ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఉద్యమాలతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. తెలంగాణలో పార్టీని స్థాపించి రాష్ర్టాన్ని సాధించిన సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సేవలు దేశానికి ఎంతో అవసరం. టీఆర్ఎస్ ఎనిమిదేండ్ల పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలబడింది. కేసీఆర్ జాతీయ రాజకీయల్లోకి రావడం శుభాపరిణామం. దేశంలోని ప్రజలందరికీ సంక్షేమ పథకాలను అందించే సత్తా సీఎం కేసీఆర్కే ఉన్నది. విజన్ ఉన్న మహా నాయకుడు, జాతీయ స్థాయిలో ఆయనకు అన్ని వర్గాల ప్రజల మద్దతు ఉంటుంది. తెలంగాణకు 24 గంటలు కరెంట్ అందిస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి గడపకు తాకుతున్నాయి. కడుపులో ఉన్న బిడ్డ కోసం కూడా పథకాన్ని రూపొందించిన గొప్ప నాయకుడు. ఎవరెన్ని విమర్శలు చేసినా భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ ప్రజల ఆదరణ పొంది దేశంలో పెద్ద జాతీయ పార్టీగా అవతరించబోతుంది.
కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరం – పల్లె మధుసూదన్రెడ్డి, అడ్వకేట్, బొంరాస్పేట
సీఎం కేసీఆర్ నాయకత్వం దేశానికి ఎంతో అవసరం. టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది. బీఆర్ఎస్తో సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలై ప్రజలకు మేలు జరుగుతుంది.
అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు – మహేందర్, అడ్వకేట్, చేవెళ్ల కోర్టు
దేశంలోనే నం.1 సీఎం మన కేసీఆర్. ఏ రాష్ట్రంలోనూ లేని అనేక సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయి. దేశానికి సీఎం కేసీఆర్ ప్రధాని అయితే అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరుగుతుంది. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అన్ని రాష్ర్టాల్లో అమలు చేయాలని కోరుతున్నారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతున్నది. జాతీయ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ రావడం ప్రజల అదృష్టంగా భావించాలి. ఇలాంటి వ్యక్తి తెలంగాణలో పుట్టడం గర్వంగా ఉంది. మనస్ఫూర్తిగా చెపుతున్నా సీఎం కేసీఆర్ చరిత్ర తిరగరాయడానికి వీలు లేకుండా పరిపాలన సాగిస్తున్నారు. భవిష్యత్లో సీఎం కేసీఆర్ ఒక చరిత్ర అవ్వడం ఖాయం. బీజేపీ పరిపాలనలో సామాన్యులు బతికే పరిస్థితి లేకుండాపోయింది. కేంద్రంలో బీజేపీ సర్కారుకు బుద్ధి చెప్పడం కేవలం కేసీఆర్కే సాధ్యమవుతుంది. దేశం ప్రస్తుతం సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఒక ముందు చూపున్న నాయకత్వం ఎంతో అవసరమని గ్రహించాలి. సీఎం కేసీఆర్కు దేశవ్యాప్త ఆదరణ బాగున్నది. దేశంలో ఒక కొత్త స్వర్ణయుగం రావాలంటే సీఎం కేసీఆర్ లాంటి నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు.
రైతులకు పథకాలు అందుతాయి – కారు చెన్నయ్య, రైతు, బోడంపహడ్
తెలంగాణలో రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తుండడంతో అన్నదాతలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రైతు బంధు, రైతు బీమా, 24 గంటల నిరంతర విద్యుత్, పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించడంతో దేశవ్యాప్తంగా రైతులకు తెలంగాణలో ఇస్తున్న పథకాలన్నీ అందుతాయి. సంతోషంగా వ్యవసాయం చేసుకుంటారు.
దేశం కోసం బీఆర్ఎస్ – జయశ్రీ, సర్పంచ్, విఠ్యాల
మన భారతదేశం అభివృద్ధిలో పరుగులు పెట్టాలంటే అది ప్రజలు, దేశం కోసం ఆలోచించే మన సీఎం కేసీఆర్కే సాధ్యం. నాడు తెలంగాణ కోసం ఏర్పడిన టీఆర్ఎస్ పార్టీని నేడు దేశం కోసం బీఆర్ఎస్గా మార్చడం సంతోషంగా ఉంది. దేశ రాజకీయాల్లో కేసీఆర్ తిరుగులేని విజయం సాధించడం ఖాయం.
దేశంలో అమలు కానున్న రాష్ట్ర పథకాలు – కొండయ్య, రైతు, పీఏసీఎస్ డైరెక్టర్ కులకచర్ల
రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్న సీఎం దేశంలో కూడా అమలు చేస్తారు. దేశ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ రావడం శుభ పరిణామం. టీఆర్ఎస్ను జాతీయ స్థాయిలో బీఆర్ఎస్గా మార్చడం హర్షణీయం.