రైతు కష్టాన్ని గుర్తెరిగిన సీఎం కేసీఆర్ రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారు. సాగు మొదలు పంట చేతికొచ్చే వరకు అండగా నిలుస్తున్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, రుణమాఫీ,
‘రైతుబంధు’తో పెట్టుబడి సాయాన్ని అందజేయడంతో పాటు సబ్సిడీపై ఎరువులు, విత్తనాలను అందిస్తున్నారు. పంట చేతి కొచ్చాక ప్రతి గింజనూ కొనుగోలు చేస్తూ అన్నదాతకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నారు. రైతు ఏ కారణం చేతనైనా మృతి చెందితే రైతు కుటుంబం రోడ్డున పడకుండా రైతు బీమా కింద రూ.5లక్షల సాయమందిస్తూ భరోసానిస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో గడిచిన ఐదేండ్లలో 3982 మంది రైతులు మృతి చెందగా, రూ.199.10 కోట్లను రైతుల కుటుంబాలకు అందజేసి కొండంత ధైర్యాన్ని నింపారు. ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకు 161 మంది రైతులు మృతి చెందగా సంబంధిత రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.8.05 కోట్ల బీమా సాయాన్ని నేరుగా రైతుల కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. తమ కుటుంబాలు రోడ్డునపడకుండా ఆర్థిక సాయమందిస్తున్న రైతు ప్రభుత్వానికి లబ్ధిదారులు చేతులెత్తి మొక్కుతున్నారు.
వికారాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): రైతు సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నది. గత ఎనిమిదేండ్లుగా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నది. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు ఇచ్చిన మాట ప్రకారం వ్యవసాయానికి తొమ్మిది గంటలపాటు విద్యుత్ను సరఫరా చేసిన ప్రభుత్వం.. 2017 జనవరి నుంచి 24 గంటలపాటు నాణ్యమైన వి ద్యుత్ను అందిస్తూ అన్నదాతలను ఆదుకుంటున్నది.
అదేవిధంగా రూ. లక్ష రుణమాఫీని పూర్తి చేసిన ప్రభుత్వం.. మరోసారి రూ.లక్ష రుణమాఫీలో భాగంగా ఇప్పటివరకు దాదాపుగా ముప్పై వేలకు పైగా రైతుల రుణాలను మాఫీ చేయగా.. మిగతా రుణాలను కూడా మాఫీ చేసేందుకు కసరత్తు చేస్తున్నది. మరోవైపు రైతులు అప్పుల ఉబి లో చిక్కుకోకుండా పంటలను సాగు చేసుకు నేం దుకు రైతుబంధు పథకాన్ని అమలు చేస్తూ ప్రతి ఏడాది ఎకరానికి పదివేల చొప్పున డబ్బులను అందిస్తున్నది. రైతులు ఏదైనా కారణంతో మర ణి స్తే ఆ బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు రూ. ఐదు లక్షల బీమాను ప్రభుత్వం అందజేస్తూ ఆదుకుంటున్నది.
వికారాబాద్ జిల్లాలో ఐదేండ్ల కాలంలో 3,982 మంది రైతులు వివిధ కారణాలతో మృతి చెందగా .. ఆబాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ఒక్కొ క్కరికి రూ.5లక్షల చొప్పున రూ.199.10 కోట్లను ప్రభుత్వం రైతుబీమా కింద పరిహారంగా అందజేసింది. మృతిచెందిన రైతు కుటుంబాలకు తొలుత రూ.5లక్షల బీమా డబ్బును బాండ్ల రూపంలో అందజేసిన ప్రభుత్వం అనంతరం నేరుగా బాధిత రైతు కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 786 మంది రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.39.30 కోట్లు, 2019-20లో 812 మంది కి రూ.40.60 కోట్లు, 2020-21లో 1,201 కుటుంబాలకు రూ.60.05 కోట్లు, 2021-22 ఆర్థిక సంవత్సరంలో 1,022 కుటుంబాలకు రూ. 51.10 కోట్లను అందజేసింది. కాగా ఇప్పటివరకు 161 మంది రైతులు మృతిచెందగా వారి కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున రూ.8.05 కోట్ల బీమా సహాయాన్ని నేరుగా రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమచేసింది.
అంతేకాకుండా రైతుబీమా పథకంలో భాగంగా బీమా సంస్థలకు రైతులు చెల్లించాల్సిన ప్రీమియం డబ్బు ను కూడా ప్రభుత్వమే చెల్లిస్తున్నది. ఒక్కొ రైతుకు రూ.3,486 చొప్పున ప్రీమియం డబ్బును చెల్లిస్తున్నది. కాగా వికారాబాద్ జిల్లాలో సుమారుగా మూడు లక్షల మంది రైతులు ఉండగా అందులో దాదాపుగా రెండు లక్షల మంది రైతులు రైతుబీమా కు అర్హులని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు. అయితే రెండేండ్ల క్రితం ఒక్కొ రైతు కు 3,013 చొప్పున రూ.50 కోట్లను ప్రభుత్వం బీమా సంస్థకు ప్రీమియంగా చెల్లించగా.. ఈ ఏడా ది ప్రీమియం డబ్బు పెరిగిన నేపథ్యంలో ఒక్కొ రైతుకు రూ.3,486 చొప్పున రూ.65 కోట్లను ప్రభుత్వం బీమా సంస్థకు చెల్లించింది.
మండలంలోని పలుగురాళ్లతండాకు చెందిన విస్లావత్ నెహ్రూనాయక్ నెల రోజుల క్రితం మృతి చెందాడు. అతడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. వారు ప్రస్తుతం పాఠశాలలో చదువుకుంటున్నారు. నెహ్రూనాయక్కు ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. వారు అన్న కుటుంబానికి బాసటగా నిలిచారు. నెహ్రూనాయక్ పేరున 30 గుంటల పొలం ఉండగా .. రైతుబీమా పథకానికి వారు దరఖాస్తు చేశారు. కాగా శుక్రవారం ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి కొడంగల్ మండలంలోని పర్సాపూర్ గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో నెహ్రూనాయక్ కుటుంబసభ్యులకు ప్రభుత్వం నుంచి మంజూరైన రైతుబీమా పత్రాన్ని అందించారు. వచ్చిన డబ్బులతో చిన్నారులకు ఉన్నత విద్యను అందిస్తామని పేర్కొన్నారు. దిక్కులేని వారికి దేవుడే దిక్కు అన్నట్లుగా తమ కుటుంబాన్ని సీఎం కేసీఆర్ ఆదుకున్నారని, ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
– కొడంగల్, నవంబర్ 25
తెలంగాణ ప్రభుత్వం అందించిన రైతుబీమా డబ్బులతో ఇంటి నిర్మా ణ సమయంలో చేసిన అప్పులు తీరాయి. మా ఇంట్లో మొత్తం ఐదుగురం ఉంటాం. నేను చిన్నగా ఉన్నప్పుడే మా నాన్న చనిపోయాడు. అనంతరం మా కుటుంబాన్ని మా అమ్మ, అన్నయ్య పోషించేవారు. మా అన్నయ్య చౌహాన్ వినోద్నాయక్ హైదరాబాద్లోని ఓ కంపెనీలో సెక్యూరిటీ గార్డ్స్ సూపర్ వైజర్గా పనిచేసేవారు. మా గ్రామమైన ఓమ్లానాయక్తండాలోని ఉన్న ఇల్లు శిథిలావస్థకు చేరడంతో.. ఆయన దానిని కూల్చివేసి నూతన ఇంటిని నిర్మించారు. అందుకు దాదాపుగా ఎనిమిది నుంచి తొమ్మిది లక్షల రూపాయలను అప్పు చేశాడు.
అయితే దురదృష్టవశాత్తు ఆయన తీవ్రమైన జ్వ రంతో 25-07-2022 నాడు చనిపోయాడు. మా అన్న చౌహాన్ వినోద్నాయక్ పేరున 21 గుంటల భూమి ఉండటంతో.. రైతుబీమా పథకానికి దరఖాస్తు చేసుకున్నాం. దరఖాస్తు చేసి నా పేరును నామినీగా ఎంట్రీ చేశాం. దీంతో 15 రోజుల్లోపే బీమా డబ్బులు రూ. ఐదు లక్షలు నా బ్యాం కు ఖాతాల్లో జమఅయ్యాయి. ఆ డబ్బులతో ఇం టి నిర్మాణం కోసం చేసిన అప్పులను చెల్లించడం జరిగింది. మా కుటుంబం రోడ్డున పడకుండా ఆదుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు ఎల్లప్పుడూ మా కుటుంబం రుణ పడి ఉంటుంది.
-చౌహాన్ అనిల్ కుమార్, రైతుబీమా లబ్ధిదారుడు, ఓమ్లానాయక్తండా, పెద్దేముల్ మండలం
వీధిన పడే నా కుటుంబాన్ని రైతుబీమా పథకం ఆదుకున్న ది. గత రెండు నెలల క్రితం నాభర్త కిష్టయ్య అనారోగ్యం తో మృతి చెందాడు. నాకు ఇద్దరు కుమారులు ఉన్నారు. రెండు ఎకరాల 20 గుంటల పొలం ఉన్నది. దీంతో రైతుబీమా పథకానికి దరఖాస్తు చేసుకోగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం రూ. ఐదు లక్షల బీమా డబ్బులను నా బ్యాంకు ఖాతాలో జమ చేసింది. వచ్చిన డబ్బులతో కుమారులను బాగా చదివిస్తున్నా. ఉండేందుకు ఇల్లు లేకపోవడంతో ఇంటిని నిర్మించుకు న్నా. ఉన్న భూమిని సాగు చేసుకుంటూ జీవిస్తున్నా. నా కుటుంబాన్ని రైతుబీమాతో ఆదుకున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు. చాకలి సత్యమ్మ, రైతు కిష్టయ్య భార్య సాల్వీడ్, కులకచర్ల మండలం
ఏదైనా కారణంతో రైతు మృతిచెందిన అనంతరం దరఖాస్తు చేసుకున్న పది రోజుల్లోనే బా ధిత రైతు కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలో బీమా డబ్బు జమఅవుతున్నది. మర ణ ధ్రువీకరణ పత్రం జారీలో ఆలస్యం కావడం, నామినీ వివరాలను తప్పుగా ఎంట్రీ చేయ డం వంటి కారణాలతోనే డబ్బులు అందడంలో జా ప్యం జరుగుతున్నది. ప్రభుత్వం నుంచి నిధుల విడుదలలో ఎలాంటి జాప్యం లేదు
– గోపాల్, వికారాబాద్ జిల్లా వ్యవసాయాధికారి