ఇబ్రహీంపట్నం, ఆగస్టు 29 : రాష్ట్రంలో వివిధ తరగతుల వారికి రోజుకో వరాన్ని ప్రకటిస్తున్న సీఎం కేసీఆర్ కళాకారులకు కూడా తీపికబురు చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళుతున్న కళాకారులకు ప్రభుత్వం సముచితస్థానం కల్పించింది. రాష్ట్ర సాంస్కృతిక మండలిలో ఉన్న 583 మంది కళాకారులకు మంగళవారం ప్రభుత్వం 30 శాతం పీఆర్సీని ప్రకటించడంతో వారు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని పేర్కొంటున్నారు. రంగారెడ్డిజిల్లా సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో 26 మంది, వికారా బాద్ జిల్లాలో 8 మంది కళాకారులున్నారు. వీరంతా జిల్లా సాంస్కృతిక మండలి ఆధ్వర్యం లో ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెడుతున్న పథకాలపై ఎప్పటికప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం వీరికి నెలకు ఒక్కొక్కరికీ రూ.24,514 వేతనాలు చెల్లిస్తున్నారు. పెరిగిన పీఆర్సీతో ఒక్కొక్కరికీ రూ.7300 అదనంగా అందనున్నది. తెలంగాణ మలి విడుత ఉద్యమంలో కళాకారుల పాత్ర ఎంతో ఉన్నది. తమ ఆటపాటల ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించారు. గజ్జకట్టి తెలంగాణ యాస, భాషల ద్వారా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి.. ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చారు. కళాకారులకు కృషిని గుర్తిస్తూ ప్రభుత్వం ప్రత్యేక సాం స్కృతిక మండలిని ఏర్పాటు చేసింది. పీఆర్సీ పెంపుతోపాటు పర్మినెంట్ చేస్తే బాగుంటుందని కళాకారులు పేర్కొంటున్నారు. ఈ సందర్భం గా సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్గౌడ్, భాష సాంస్కృతికశాఖ డైరెక్టర్ హరికృష్ణ, చైర్మన్ రసమయిలకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
కళాకారులకు సముచిత స్థానం..
కళాకారులకు సముచిత గౌరవం ఇచ్చినందుకు సీఎం కేసీఆర్కు రుణపడి ఉం టాం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కళాకారుల జీవితాల్లో వెలుగులు నిండుతాయి. పీఆర్సీ 30 శాతం పెంపు హర్షణీయం.
-యాదయ్య, కళాకారుడు, చిత్తాపూర్
గొప్ప మనస్సున్న నాయకుడు
ప్రభుత్వ పథకాలను ఆటపాటల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్న తమకు ప్రభుత్వం సముచిత స్థానం ఇవ్వడం హర్షణీయం. కళాకారులకు 30శాతం పీఆర్సీని పెంచుతూ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రికి జీవితాంతం రుణపడి ఉంటాం. గొప్ప మనస్సున్న నాయకుడు ఆయన.
-మోహన్, కళాకారుడు
కళాకారుల సంక్షేమానికి కృషి
కళాకారుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తు న్నది. తెలంగాణ ఉద్యమంలో ఆటపాటలతో ప్రజల్లో చైత న్యం తీసుకొచ్చిన నాలాంటి ఎంతోమంది కళాకారుల అభ్యున్నతికి కృషి చేయడం సంతోషకరం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన వెంటనే కళాకారుల మండలిని ఏర్పాటుచేసి వేతనాలను చెల్లిస్తున్నారు. 30 శాతం పీఆర్సీని పెంచిన సర్కార్కు రుణపడి ఉంటాం.
-బోడ చంద్రప్రకాశ్, కళాకారుల ఉద్యోగసంఘం రాష్ట్ర నాయకుడు
సీఎంకు రుణపడి ఉంటాం
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ.. వారిలో చైతన్యా న్ని తీసుకొస్తున్న మాకు సీఎం కేసీఆర్ వేతనాలు పెంచి ఆదుకున్నారు. కళాకారులకోసం సాంస్కృతిక మండలిని ఏర్పా టు చేసి అందులో ఉద్యోగాలు కల్పించిన ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం.
– భిక్షపతి, కళాకారుడు