కొత్తూరు : సీఎం సహాయనిధి పేదలకు వరం అని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపూర్ రైల్వేస్టేషన్కు చెందిన ఎండీ మిస్కిన్కు రూ. 60వేల చెక్కును శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మాట్లాడుతూ కార్పొరేట్ వైద్యం పొందలేని పేద వారికి సీఎం సహాయనిధి వరం లాంటిది అని అన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా సీఎం కేసీఆర్ అర్హులందరికీ సీఎం సహాయనిధి ద్వారా సహాయం అందిస్తున్నారని చెప్పారు.
అర్హులైన నిరుపేదలకు సీఎం సహాయం నిధిని ఉపయోగించుకుని మెరుగైన వైద్యాన్ని పొందాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ డోలి రవీందర్, కౌన్సిలర్ కోస్గి శ్రీనివాస్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దేవేందర్ యాదవ్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ విఠల్, మల్లాపూర్ మధు, భాస్కర్ పాల్గొన్నారు.