వికారాబాద్, డిసెంబర్ 20 : శాంతి, సంతోషానికి చిహ్నంగా క్రిస్మస్ పండుగను జరుపుకొంటారని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. మంగళవారం వికారాబాద్ ఎస్పీ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ సందర్భంగా పోలీస్ అధికారులు, సిబ్బంది కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఎస్పీకి వారు కేక్ తినిపించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కులమతాలకు అతీతంగా జిల్లా ప్రజలు అన్ని పండుగల్లో పాల్గొనడం మంచి విషయమని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ఎం.ఏ.రశీద్, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్రావు, సీసీఎస్ ఇన్స్పెక్టర్ దాసు, మహిళా సీఐ ప్రమీల, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ అప్పయ్య, ఏవో వందన, ఎస్సైలు, డీపీవో సిబ్బంది పాల్గొన్నారు.