వికారాబాద్ : ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని వికారాబాద్ మెథడిస్ట్ చర్చితో పాటు పలు చర్చిలలో క్రైస్తవులు ప్రార్థనలు చేశారు. పండుగను పురస్కరించుకుని ముందస్తుగా చర్చిలను అందంగా అలంకరించి, విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. పలు చర్చిలో ప్రార్థనలు చేసి ఏసు ప్రభు జీవిత విశేషాలను తెలుసుకున్నారు. పాస్టర్లు గ్రంథాలను చదువుతూ ప్రజలకు హితవు బోధించారు. కేక్ కట్ చేసి చిన్నారులు, పెద్దలు కలిసి పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఏసుప్రభు, మరియమ్మ వేశాధారణలో చిన్నారులు ఆట పాటలతో అలరించారు. క్రిస్మస్ తాత చిన్నారులతో ఆటలాడి సందడి చేశారు.
పట్టణ క్రైస్తవులు పెద్త ఎత్తున పాల్గొనడంతో పండగ వాతావరణం నెలకొంది. మెథడిస్ట్ చర్చికి ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కుటుంబ సభ్యులతో హాజరై ప్రార్థనలు చేసి కేక్ కట్ చేశారు. వేడుకలకు రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్పటేల్, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేశ్, కౌన్సిలర్లు కృష్ణారెడ్డి, చర్చి పాస్టర్లు, నాయకులు పాల్గొన్నారు.