ఇబ్రహీంపట్నంరూరల్ : పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి పథకం కొండంత అండగా నిలుస్తున్నదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నంకు చెందిన దూలం కిరణ్కుమార్ అనారోగ్యంతో నగరంలోని ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందగా అతడికి ప్రభుత్వం నుంచి రూ. 55వేలు సీఎం సహాయనిధి మంజూరైంది. అట్టి చెక్కును క్యాంపు కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే అందజేశారు. కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైనప్పటికీ పేదకు అందించే సంక్షేమ కార్యక్రమాలకు లోటు రాకుండా కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన చర్యలు అభినందనీయమన్నారు.
ఆరోగ్యశ్రీ పథకం కింద 164రకాల వైద్యసేవలు ఉచితంగా లభిస్తున్నాయని, వాటిని పొందలేనివారు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా తగు సహాయం పొందవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, వైస్ ఎంపీపీ ప్రతాప్రెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు వెంకటేష్గుప్తా పాల్గొన్నారు.