ఇబ్రహీంపట్నంరూరల్ : అన్నధాతల ఆరాధ్యదైవం ముఖ్యమంత్రి కేసీఆర్ అని రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మొద్దు అంజిరెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు బూడిద నర్సింహారెడ్డిలు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి పంట పెట్టుబడి 8వ విడుత రైతుబంధు సహాయం రైతుల ఖాతాల్లో జమచేయడాన్ని హర్షిస్తూ మంగళవారం ఇబ్రహీంపట్నం మండలంలోని ఉప్పరిగూడ రైతు వేదికలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి రైతులతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో పంటల పెట్టుబడి సహాయం కింద ప్రతి ఏడాది ఎకరాకు పదివేలు అందజేసి ఆదుకుంటున్నారన్నారు.
రైతుల కష్టాలు తెలిసిన గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి కావడం రాష్ట్ర రైతాంగం అదృష్టమని వారు తెలిపారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు కాయితి మోహన్రెడ్డి, కో-ఆప్షన్ సభ్యులు మడుపు గోపాల్, రైతులు రమేశ్, శ్రీశైలం, వెంకటేశ్, యాదగిరిరెడ్డి, మోహన్, నర్సింహ తదితరులు ఉన్నారు.