చేవెళ్ల టౌన్ : టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి మండల కమిటీలు కీలకమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో చేవెళ్ల మండల కమిటీని ఎన్నుకున్నారు. రెండోసారి కూడా టీఆర్ఎస్ మండల కమిటీ అధ్యక్షుడిగా పెద్దోళ్ల ప్రభాకర్ను ఎన్నుకోగా వైస్ ప్రెసెడెంట్గా రామగౌడ్, ఇంద్రాసేనరెడ్డి, చందు, జనరల్ సెక్రెటరీగా హనుమంత్రెడ్డి, సెక్రెటరీగా వెంకటేశ్, శ్రీనివాస్ గౌడ్, ముకుందం గౌడ్, ఎల్లయ్య, రాములు, మండల బీసీసెల్ అధ్యక్షుడు రాములు, ఎస్సీసెల్ అధ్యక్షుడిగా గండు రవీందర్, మైనార్టీ అధ్యక్షుడిగా అబ్ధుల్ గని, మహిళ అధ్యక్షురాలుగా మిట్ట లతారంగారెడ్డి, యువజన అధ్యక్షులుగా తోట చంద్రశేఖర్, టీఆర్ఎస్వీ అధ్యక్షులుగా వంశీలను ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్షేమ రంగంలో టీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలోనే ముందుందన్నారు. టీఆర్ఎస్ బలోపేతమే లక్ష్యంగా నూతన మండల కమిటీ అధ్యక్షులు పని చేయాలని తెలిపారు. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకే కమిటీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మండల కమిటీ అధ్యక్షుడు ప్రభాకర్ను ఎమ్మెల్యే సన్మానించారు. అదే విధంగా నూతన మండల అధ్యక్షుడు ప్రభాకర్ను టీఆర్ఎస్ చేవెళ్ల నియోజకవర్గం యూత్ అధ్యక్షుడు వనం లక్ష్మికాంత్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డిలు పూలు, శాలువలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ చేవెళ్ల నియోజకవర్గం యూత్ అధ్యక్షుడు వనం లక్ష్మికాంత్రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ నర్సింహులు, మాణిక్య రెడ్డి, నాయకులు భూపతిరెడ్డి, శివారెడ్డి, రవీందర్, యాదిరెడ్డి ఉన్నారు.