షాబాద్ : పేద ప్రజల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని షాబాద్ జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి అన్నారు. సోమవారం జడ్పీటీసీ పుట్టినరోజు సందర్భంగా నగరంలో మంత్రి కేటీఆర్ను కలిసి బోకే అందజేసి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం షాబాద్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేశారు. మంత్రి కేటీఆర్ స్ఫూర్తితో తన జన్మదినం సందర్భంగా గిప్ట్ ఏ స్మైల్ కింద తన సొంత డబ్బులు రూ. 10లక్షలు వెచ్చించి వికలాంగులకు ట్రై స్కూటీలు పంపిణీ చేశారు. అనంతరం పార్టీ కార్యకర్తలు గజమాలలతో ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అవినాశ్రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు, కార్యకర్తల అభిమానానికి ఎల్లవేళాల రుణపడి, ప్రజాసేవకు కృషి చేస్తానని తెలిపారు.
పట్నం(తమ)కుటుంబానికి రాజకీయ జీవితాన్ని అందించిన షాబాద్ను ఎప్పటికీ మరిచిపోమని స్పష్టం చేశారు. షాబాద్ మండలానికి అత్యధికంగా నిధులు తీసుకువచ్చి జిల్లాలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. తన పుట్టినరోజున వికలాంగులకు తనవంతు సాయంగా ట్రై స్కూటీలు అందించడం జరిగిందన్నారు. దశలవారిగా పేదలు, వృద్ధులకు సహకారం అందిస్తానని చెప్పారు.
కార్యక్రమంలో పీఏసీఏస్ చైర్మన్ శేఖర్రెడ్డి, వైస్ చైర్మన్ మల్లేశ్, మండల అధ్యక్ష, కార్యదర్శులు నర్సింగ్రావు, శ్రీరాంరెడ్డి, వెంకట్యాదవ్, ఎస్సీసెల్ అధ్యక్షుడు తొంట వెంకటయ్య, జిల్లా లీగల్ అడ్వైజర్ పీసరి సతీశ్రెడ్డి, కో-ఆప్షన్ సభ్యుడు చాంద్పాషా, మైనార్టీసెల్ అధ్యక్షుడు ఇమ్రాన్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.