పరిగి, ఏప్రిల్ 14: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని ఆదివారం పరిగిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పరిగి పట్ట ణంలోని అంబేద్కర్ విగ్రహానికి చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎ.సురేందర్, వైస్ ఎంపీపీ కె.సత్యనారాయణ, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఎస్.భాస్కర్, నాయకులు బి.ప్రవీణ్కుమార్రెడ్డి, ఎ.కృష్ణ, బి.రవి కుమార్, హన్మంతు, ఆంజనేయులు, కౌన్సిలర్లు ఎదిరె కృష్ణ, బి.నాగేశ్వర్, టి. వెంకటేశ్, ప్రజా సంఘాల నాయకులు, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగంతోనే అన్ని వర్గాలకు అవకాశాలు దక్కాయని వారు పేర్కొ న్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలన్నారు.
తాండూరు: అంబేద్కర్ 133వ జయంతిని రాజకీయ పార్టీల నేతలు, కులసంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆదివారం తాండూరు నియోజక వర్గంలో ఘనంగా నిర్వహించారు. తాండూరు పట్టణంతో పాటు తాండూరు, యాలాల, పెద్దేముల్, బషీరాబాద్ మండలాల్లోని పల్లెల్లో అంబేద్కర్ విగ్రహా లకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. తాండూరులో ఎమ్మెల్యే మనోహర్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, వైస్ చైర్పర్సన్ దీపతో పాటు కౌన్సిలర్లు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ అంటరానితనం, అసమానతలను అంతమొందించి వెనుకబడిన కులాలు, తెగల వారికి స్వేచ్ఛను, ఆత్మగౌరవాన్ని ప్రసాదించాడని పేర్కొన్నారు. నేటి తరం వారి మార్గంలో నడవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు.
కొడంగల్: అంబేద్కర్ అందరివాడని ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్, మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్రెడ్డి కొనియాడారు. రాజ్యాంగం ద్వారా ప్రజలందరికీ హక్కులు, బాధ్యతలు ఇచ్చిన దూరదృష్టి కలిగిన విజ్ఞాని అని ఆయన ఆశయాలను, సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లడమే నిజమైన నివాళి అని వారు పేర్కొన్నారు. ఆదివారం బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని మండల పరిధిలోని గ్రామాల్లో ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కార్యక్రమంలో భాగంగా పట్టణంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించారు. స్థానిక గాంధీనగర్ నుంచి అంబేద్కర్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. కూడలిలో అంబేద్కర్ విగ్రహానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో పీఏసీఎస్ అధ్యక్షుడు శివకుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ప్రశాంత్, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు రమేశ్, రమేశ్బాబు, కృష్ణంరాజు, దాము, కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.
దోమ: అంబేద్కర్ ఆదర్శప్రాయుడని సర్పంచ్ల సంఘం మండల మాజీ అధ్యక్షుడు రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాలి విజయ్కుమార్రెడ్డి అన్నారు. దోమ మండల కేంద్రంలో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతకు ముందు కేక్ కట్ చేసి పరస్పరం తినిపించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అంబేద్కర్ అడుగు జాడల్లో నడిచి సమసమాజ స్థాపనకు కృషి చేయాలన్నారు.
అలాగే మండల పరిధిలోని అయినాపూర్, దిర్సంపల్లి, బొంపల్లి, బడెంపల్లి, మల్లేపల్లి, దాదాపూర్ తదితర గ్రామాల్లో అంబేద్కర్ జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ లక్ష్మయ్య, పీఏసీఎస్ డైరెక్టర్ వెంకటయ్య, లింగన్పల్లి యువ నాయకుడు వెంకటయ్య, యువ నాయకుడు శివకుమార్రెడ్డి, మాజీ వార్డు సభ్యుడు రమేశ్, అంబేద్కర్ సంఘం నాయకులు జంగయ్య, యాదయ్య, సురేందర్, కృష్ణ, రాములు, నర్సింహులు, రాజు, ఆయా గ్రామాల అంబేద్కర్ సంఘాల నాయకులు, మాజీ సర్పంచ్లు, ఎంసీటీసీలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
కులకచర్ల : మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో అంబేద్కర్ జయంతిని అంబేద్కర్ యువజన సంఘాలు, దళిత సంఘాలు, పలు యువజన సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కులకచర్లలో పలువురు ప్రముఖులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కులకచర్ల పీఏసీఎస్ చైర్మన్ మొగులయ్య, దళిత యువశక్తి యువజన సంఘం అధ్యక్షుడు భరత్కుమార్, దళిత సంఘం నాయకులు రాములు, నాయకులు రాంరెడ్డి, భీంరెడ్డి, సౌమ్యావెంకట్రాంరెడ్డి, లక్ష్మయ్య, నర్సింహులు, వెంకటేశ్,
లక్ష్మయ్య, గోపాల్నాయక్, వెంకటయ్యగౌడ్, వెంకట్రాములు, కృష్ణయ్యగౌడ్, శాంతీరంగ్య, ఎంపీటీసీ ఆనందం, పలు గ్రామాల దళిత సంఘాల నాయకులు, అంబేద్కర్ సంఘాల నాయకులు, అంబేద్కర్ అభిమానులు పాల్గొన్నారు. ముజాహిద్పూర్లో అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆంజనేయులు ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. చౌడాపూర్ మం డల కేంద్రంలో దళితసంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ రాందాస్నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అశోక్, దళిత, అంబేద్కర్ యువజన సంఘాల నాయకులు, సభ్యులు, అంబేద్కర్ అభిమానులు పాల్గొన్నారు.
పెద్దేముల్: మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో అంబేద్కర్ జయంతి వేడు కలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సంఘాల నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండల కేంద్రంలో ముస్లిం వెల్ఫేర్ యూత్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాండూరు ఎమ్మెల్యే మనోహార్ రెడ్డి పాల్గొని పలువురికి జ్యూస్ను కూడా అందజేశారు. కార్యక్రమంలో పెద్దేముల్ జైభీమ్ యూత్, పలు సంఘాల ప్రతి నిధులు, యువకులు నాయకులు మహిపాల్ రెడ్డి, నర్సింహులు, ఎండీ రియాజ్, ముస్లిం వెల్ఫేర్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
యాలాల: మండల కేంద్రంలో అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వ హిం చారు. మాజీ జడ్పీటీసీ శ్రీనివాస అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివా ళులర్పించారు. కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు మల్కయ్య, వ్యవ సాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బుగ్గప్ప, నర్సింహులు పాల్గొన్నారు.
బొంరాస్పేట : అంబేద్కర్ జయంతిని ఆదివారం బొంరాస్పేట, దుద్యాల మండలాల్లో ఘనంగా నిర్వహించారు. బొంరాస్పేటలోని ఎంఆర్సీ కార్యా లయ ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి టీవీవీ రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్, జిల్లా అధ్యక్షుడు బాకారం చంద్రశేఖర్, గోపాల్, తోలు వెంకటయ్య తదితరులు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. భూలక్ష్మీ దేవాలయం చౌరస్తాలో, మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో అంబేద్కర్ విగ్రహానికి యువజన సంఘాల నాయకులు, పంచాయతీ కార్యదర్శులు అంబేద్కర్కు నివాళి అర్పించారు.
వికారాబాద్ : అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఆదివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కన్వీనర్ రవీందర్ అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కో కన్వీనర్లు మంగలి నరేశ్, యాదగిరి, వెంకటేశ్, మల్లికార్జున్, ఆయా మండల కన్వీనర్లు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ధారూరు : మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆదివారం మండల పరిధిలోని కుక్కింద, అం తారం, ధారూరు, నర్సాపూర్, మున్నూర్సోమారం, నాగసముందర్, తరిగోపుల, నాగారం తదితర గ్రామాల్లో పలువురు నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆయా గ్రామ పంచాయతీల కార్యదర్శులు, నాయకులు, ప్రజాప్రతినిధులు, ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు, గ్రామ పెద్దలు, అధికారులు పాల్గొన్నారు
తాండూరు రూరల్ : తాండూరు మండలంలోని పలు గ్రామాల్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు. చెంగోల్ గ్రామంలో జడ్పీటీసీ గౌడి మంజుల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బెల్కటూర్, మిట్టబాసుపల్లి, గుంతబాసుపల్లి, గౌతాపూర్ తదితర గ్రామాల్లో బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎస్సై విఠల్రెడ్డి, ఎంపీటీసీలు రాజమణి, నరేందర్రెడ్డి, శకుంతల, మాజీ సర్పంచ్లు రాజప్ప, నరేందర్రెడ్డి, జగదీశ్, తదితరులు పాల్గొన్నారు.
పూడూరు : మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. ఆదివారం పూడూరు, అంగడి చిట్టంపల్లి, పెద్ద ఉమ్మెంతాల్, కంకల్, కండ్లపల్లి, నిజాంపేట్ మేడిపల్లి, చన్గోముల్, మీర్జాపూర్ తదితర గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహానికి పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, సంఘం నాయకులు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ మల్లేశం, నాయకులు వెంకటయ్య, నర్సింహులు, శ్రీనివాస్, రాజేందర్, తాజోద్దీన్, ఎంపీటీసీ సురేందర్, ఎండీ శకీల్, రమేశ్, రవి, విఠలయ్య, అన్వర్, కిష్టయ్య, ఆయా గ్రామాల ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, యువజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.