షాబాద్, మార్చి 27 : రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా సోమవారం 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల్లో 13,634 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 990 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. 851 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ చేశారు.
బొంరాస్పేట : జిల్లాలోని 42 కంటి వెలుగు కేంద్రాల్లో వైద్య బృందాలు 5477 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 575 మందికి రీడింగ్ గ్లాసులు ఇవ్వగా, 529 మందికి అద్దాలను ఆర్డరిచ్చారు. ఇప్పటివరకు 264 గ్రామాలు, 55 వార్డుల్లో శిబిరాలను నిర్వహించినట్లు డీఎంహెచ్వో పాల్వన్కుమార్ తెలిపారు.
– ఎం.గోవర్ధన్రెడ్డి, గొల్లపల్లి, చేవెళ్ల మండలం
కంటి పరీక్షలు చేసుకోవాలంటే గతంలో వేరే చోటుకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు లేకుండా తెలంగాణ ప్రభుత్వమే గ్రామాలకు వైద్యులను పంపి ఉచితంగా పరీక్షలు, మందులు, అద్దాలు అందిస్తున్నది. సీఎం కేసీఆర్ లాంటి వ్యక్తిని ఇప్పటివరకు నేను చూడలేదు. ఆయనకు మా కృతజ్ఞతలు.