శంకర్పల్లి, ఫిబ్రవరి 26 : పార్టీలు మారే నాయకులు పదవులకు రాజీనామా చేసి మారాలని, రాజీనామా చేయకుండా మారడం సరికాదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. సోమవారం శంకపర్ల్లి మున్సిపాలిటీ పరిధిలో కౌన్సిలర్లతో కలిసి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీలో కారు గుర్తుపై గెలిచి పార్టీలు మారడం సమంజసం కాదన్నారు. వైస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, కౌన్సిలర్లు పదవులకు రాజీనామా చేసి పార్టీలు మారాలని అన్నారు. సమావేశంలో విజయలక్ష్మి, లక్ష్మమ్మ, శ్వేత, శ్రీనాథ్గౌడ్, అశోక్, పార్శ రాధ, చంద్రమౌళి, కోఆప్షన్ సభ్యుడు వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.