షాబాద్, మార్చి 16 : సీడీపీ (నియోజకవర్గ అభివృద్ధి ఫండ్స్) నిధుల కోసమే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిశానని, ఇందులో ఎలాంటి రాజకీయం లేదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నా రు. శనివారం చేవెళ్లలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆయ న మాట్లాడుతూ…తాను పార్టీ మారుతున్నట్లు కొన్ని మీడియాల్లో ప్రచారం చేస్తున్నారని, అలాంటిది ఏమి లేదని, పార్టీ మారడం పూర్తిగా అవాస్తవమన్నారు.
నియోజకవర్గానికి 2023-2024 ఆర్థిక సం వత్సరానికి సంబంధించిన సీడీపీ నిధులు రూ.3కోట్లు ఆపేశారని, ఈ విషయమై అసెం బ్లీ ఎన్నికల కంటే ముందే ప్రపోజల్స్ ఇచ్చామన్నారు. తన ప్రతిపాదనలను కలెక్టర్ తీసుకుని జిల్లా ఇన్చార్జి మంత్రితో సంతకాలు చేసి ఇచ్చారన్నారు. అప్పుడున్న కలెక్టర్ దా నిపై సంతకం చేయకపోవడంతో అలాగే పెం డింగ్లో ఉందన్నారు. ఎన్నికల కంటే ముం దే వెళ్లి అడిగితే ఎన్నికల తర్వాత మాట్లాడుతామని చెప్పారని.. ఎన్నికల తర్వాత వెళ్లి అడిగితే ఆ లెక్క అక్కడికే ముగుస్తుందని చెప్పినట్లు తెలిపారు. ఇంకా నాలుగు నెలల సమయం ఉందని నిధులు కేటాయించాలని అడిగితే.. ప్రభుత్వం నుంచి సీడీపీ నిధులను ఆపాలని చెప్పారని.. ఈ విషయంపైనే సీఎం రేవంత్రెడ్డిని కలిసినట్లు చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రులను, మంత్రులను కలవడం సహజమని.. కానీ మీడియా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నదన్నారు.
ఎంపీ రంజిత్రెడ్డి నాకు ఏమి చెప్పలేదని, నేను కూడా ఆయనతో ఏమి మాట్లాడలేదన్నారు. తనపై జరుగుతున్న ప్రచారం పూర్తి అవాస్తమన్నారు. తాను బీఆర్ఎస్ పార్టీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెంటే జీవితాంతం ఉంటానని ఎమ్మెల్యే యాదయ్య స్పష్టం చేశారు. సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు దేశమళ్ల ఆంజనేయులు, మర్పల్లి కృష్ణారెడ్డి, కొంపల్లి అనంతరెడ్డి, గిరిధర్రెడ్డి, శివప్రసాద్, గోపాల్, ఆయా మండలాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.