మహబూబ్నగర్, జూలై 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మహబూబ్నగర్ జిల్లా బాదేపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన మక్కల కొనుగోళ్లలో అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. చైర్మన్తో కుమ్మక్కైన మార్క్ఫెడ్ డీఎంను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం హార్టికల్చర్ ఆఫీసర్ వేణుగోపాలరావు నేతృత్వంలోని విచారణ బృందం రికార్డులన్నింటినీ కలెక్టర్ కార్యాలయానికి తెప్పించుకొని అర్ధరాత్రి వరకు పరిశీలించింది.
రైతులు అమ్మిన పంటకు వారికి చెల్లించిన డబ్బులకు వ్యత్యాసం ఎక్కువగా ఉండటాన్ని ప్రాథమికంగా గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా మొక్కజొన్న బస్తాలను తన గోదాంకు తరలించి భారీ ఎత్తున తరుగు చూయించి మిగిలిన బస్తాలను బినామీ పేర్లతో అమ్ముకున్నట్టు రికార్డుల్లో తేలుతున్నది. మార్క్ఫెడ్ పంపిణీ చేసిన డబ్బులను ట్రాక్ షీట్లతో సరి పోల్చుతున్నారు. అక్రమాలు నిజమని తేలితే చైర్మన్పై క్రిమినల్ చర్యలతో పాటు రికవరీకి కూడా అవకాశం ఉందని ఒక అధికారి వెల్లడించారు.