చేవెళ్ల టౌన్ : సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్లో పెద్ద ఎత్తున చేరుతున్నారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. గురువారం చేవెళ్ల మండల కేంద్రంలోని కేజీఆర్ గార్డెన్లో నిర్వహించిన నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తల విస్త్రృతస్థాయి సమావేశానికి విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ సునితారెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య సమక్షంలో శంకర్పల్లి మండల కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు నర్సింహారెడ్డితో పాటు పలువురు కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. అనంతరం మంత్రి సబితారెడ్డి పార్టీలో చేరిన వారికి టీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల మన్ననలు పొందారని గుర్తు చేశారు. ప్రతి కార్యకర్త పార్టీ పటిష్టతకు పాటు పడాలని సూచించారు. కార్యక్రమంలో శంకర్పల్లి, మొయినాబాద్, షాబాద్, నవాబ్పేట్, చేవెళ్ల మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, టీఆర్ఎస్ అధ్యక్షులు, సర్పంచ్లు పాల్గొన్నారు.