చేవెళ్ల టౌన్ : సమస్యల పరిష్కారానికి ‘శుభోదయం’ అనే కార్యక్రమంలో ఇంటింటికీ తిరుగుతూ అక్కడికక్కడే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. ఆదివారం చేవెళ్ల మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుభోదయం కార్యక్రమం ద్వారా గ్రామాల్లో సమస్యలు నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు జనవరి 2న చేపట్టిన ‘శుభోదయం’ కరోనాతో తమ తండ్రి మృతి చెందడంతో కార్యక్రమం వాయిదా వేయడం జరిగిందని తెలిపారు.
మళ్లీ నేటి నుంచి చేవెళ్ల మండలంలోని ముడిమ్యాల, రావులపల్లి గ్రామాల్లో రేపు ఉదయం 6గంటలకు ప్రారంభించి సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తామన్నారు. చేవెళ్ల డివిజన్లోని మండలాల వారీగా శంకర్పల్లి, షాబాద్, మొయినాబాద్, నవాబ్పేట్ మండలాల్లో దశల వారీగా నిర్వహిస్తామన్నారు. కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల అధికారులు హాజరై సమస్యలు పరిష్కరించడంలో భాగస్వాములు కావాలని కోరారు.
కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ పట్లొళ్ల కృష్ణారెడ్డి, ఎంపీపీ విజయలక్ష్మిరమణారెడ్డి, జడ్పీటీసీ మర్పల్లి మాలతి కృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ కర్నె శివస్రాద్, మాజీ ఎంపీపీ మంగళి బాల్రాజ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెద్దొళ్ల ప్రభాకర్, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు శేరి శివారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మాణిక్య రెడ్డి, దేవుని ఎర్రవల్లి సర్పంచ్ సామ మాణిక్యరెడ్డి, సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి, రమణారెడ్డి ఉన్నారు.