కడ్తాల్ : మండల కేంద్రంతో పాటు పరిధిలోని ఆయా గ్రామాల్లో గురువారం వైకుంఠ ఏకాదశిని భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయాలలో ఉదయం నుంచే స్వామి వారిని ఉత్తర ద్వారం నుంచి భక్తులు దర్శించుకున్నారు. పట్టణంలోని లక్ష్మీచెన్నకేశవస్వామి, మక్తమాదారం గ్రామంలోని వేణుగోపాలస్వామి ఆలయాలలో ప్రధాన అర్చకులు మెళ్లూరి వెంకటేశ్వరశర్మ, వింజామూరు రామానుజాచార్యుల ఆధ్వర్యంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషకాలు, తిరుమంజానం, విష్ణుసహస్రనామ, భగవద్గీత పారాయణం, కృష్ణాష్టీకం, హన్మాన్చాలీసా పఠనం తదితర కార్యక్రమాలు నిర్వహించారు.
అనంతరం స్వామి వారి తీర్థప్రసాదాలను భక్తులకు అందజేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, సర్పంచ్లు లక్ష్మీనర్సింహారెడ్డి, సులోచన, ఎంపీటీసీ శ్రీనివాస్రెడ్డి, ఉప సర్పంచ్ రామకృష్ణ, నాయకులు నరేందర్రెడ్డి, చందోజీ, ఆంజనేయులు పాల్గొన్నారు.