షాద్నగర్టౌన్, సెప్టెంబర్ 26: నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ వీరవనిత ఐలమ్మ ప్రతి ఒక్కరికి ఆదర్శమని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. ఐలమ్మ జయంతి సందర్భంగా రజక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం సమీపంలో ఉన్న ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాయుధ పోరాటంలో ఆమె పోరాటాన్ని గుర్తు చేశారు. కార్యక్రమంలో కమిషనర్ వెంకన్న, కౌన్సిలర్ అంతయ్య, నాయకులు వంకాయల నారాయణరెడ్డి, జూపల్లి శంకర్, నర్సింహులు, శేఖర్, శ్రీనివాస్, నందకిషోర్, రజక సంఘం నాయకులు పాల్గొన్నారు.
చేవెళ్లటౌన్: చాకలి ఐలమ్మను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. జయంతి సందర్భంగా మండల కేంద్రంలోని ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భూమి కోసం, భుక్తి కోసం బానిస బతుకుల విముక్తి కోసం రజాకారులను, భూస్వాములను ఎదిరించిన తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ అని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మి, వైస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రభాకర్, బీసీ సెల్ మండల అధ్యక్షుడు రామా గౌడ్, సర్పంచ్లు వెంకటేశం గుప్తా, నర్సింహులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు వెంకటేశ్, కృష్ణ, మహేశ్, రజక సంఘం నాయకులు జంగయ్య, శ్రీనివాస్, రాజేశ్, రవి తదితరులు పాల్గొన్నారు.
మొయినాబాద్ : వీర వనిత ఐలమ్మ నేటి తరం మహిళలకు స్ఫూర్తిదాయకం అని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల పరిధిలోని అజీజ్నగర్ గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాయుధ పోరాట యోధురాలు ఐలమ్మ విగ్రహాన్ని ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్తో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్ బి సంద్య, ఎంపీటీసీ సుజాత, ఏఎంసీ వైస్ చైర్మన్ డప్పు రాజు, మాజీ ఎంపీటీసీ మాణిక్రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ శ్రీశైలం, నాయకులు జయవంత్, మల్లారెడ్డి, సత్యనారాయణ, చెన్నారెడ్డి, వెంకట్రెడ్డి, భాస్కర్రెడ్డి, కొండల్రెడ్డి పాల్గొన్నారు.
కడ్తాల్ : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు వీరనారి ఐలమ్మ జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఐలమ్మ జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఐలమ్మ చిత్రపటానికి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళుర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ చేసిన పోరాటాలు చిరస్మరణీయమని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ దశరథ్నాయక్, వైస్ ఎంపీపీ ఆనంద్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాస్రెడ్డి, ఉప సర్పంచ్ రామకృష్ణ, ఏఎంసీ, పీఏసీఎస్ డైరెక్టర్లు లాయక్అలీ, వెంకటేశ్, నర్సింహ, భిక్షపతి, రామచంద్రయ్య, రాఘవేందర్, కృష్ణ, పాండు, మహేశ్, రజక సంఘం నాయకులు కృష్ణయ్య, వెంకటయ్య, శంకర్, బాలరాజు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
యాచారం : మండల కేంద్రంలో ఐలమ్మ జయంతి సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన ఐలమ్మ విగ్రహాన్ని మండల రజక నాయకులతో కలిసి ఎంపీపీ సుకన్య ప్రారంభించారు. విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు.
ఇబ్రహీంపట్నంరూరల్ : రాయపోల్ గ్రామంలో ఐలమ్మ చిత్రపటానికి గ్రామపంచాయతీ పాలకవర్గంతో పాటు గ్రామస్తులు పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ బల్వంత్రెడ్డి, ఉపసర్పంచ్ బాలరాజు, వార్డుసభ్యులు పాల్గొన్నారు.
పెద్దఅంబర్పేట : మున్సిపాలిటీతోపాటు అబ్దుల్లాపూర్మెట్టు మండలంలోని తారామతిపేటలో మంగళవారం చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఐలమ్మను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని అన్ని రంగాల్లో ముందుకు సాగాలని ప్రజాప్రతినిధులు కోరారు. కార్యక్రమంలో తారామతిపేట ఎంపీటీసీ వెంకటేశ్యాదవ్, ఉపసర్పంచ్ గొశిక నర్సింహ, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
షాబాద్: ఐలమ్మ ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలని వైస్ ఎంపీపీ జడల లక్ష్మి, రజక సంఘం జేఏసీ జిల్లా అధ్యక్షుడు గడ్డం చంద్రయ్య అన్నారు. ఐలమ్మ జయంతి సందర్భంగా షాబాద్లో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ తమ్మలి సుబ్రహ్మణ్యేశ్వరి, రజకసంఘం సభ్యులు రాము, అంజయ్య, రమేశ్, నర్సింహులు, లక్ష్మయ్య, హరికుమార్, సురేశ్, బాల్రాజ్, మల్లేశ్, శివ తదితరులున్నారు.
ఆమనగల్లు : నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా వీరనారి ఐలమ్మ చేసిన పోరాటం మరువలేనిదని జడ్పీటీసీ నేనావత్ అనురాధ అన్నారు. పట్టణంలోని హైదరాబాద్ -శ్రీశైలం జాతీయ రహదారి పక్కన రజక సంఘం ఆధ్వర్యంలో ఐలమ్మ జయంతిని నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్ఐ బలరాం, బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు నేనావత్ పత్యానాయక్, నాయకులు రాము, అల్లాజీ, వెంకటేశ్, లండం యాదయ్య, రజక సంఘం నాయకులు నాగిళ్ల జగన్, మద్దూరి ఆనంద్, రమేశ్, అయోధ్య పాల్గొన్నారు.
తలకొండపల్లి : మండల వ్యాప్తంగా ఐలమ్మ జయంతిని నిర్వహించారు. గట్టుఇప్పలపల్లి గ్రామంలో ఆమనగల్లు-షాద్నగర్ రహదారి వివేకానంద విగ్రహం వద్ద జయంతి నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీనివాస్, రాజు, కుమార్, నర్సింహ, సురేశ్, వెంకటయ్య, రాములు, కృష్ణ, జంగయ్య, రవి, శ్రీనివాసులు పాల్గొన్నారు.