వికారాబాద్, ఏప్రిల్ 20 : సీఈఐఆర్ వెబ్ సైట్ ద్వారా జిల్లాల్లో మొదటి సెల్ఫోన్ ఆచూకీ కనుగొనడం జరిగిందని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో బాధితుడికి సీఈఐఆర్ యాప్ ద్వారా దొరికిన సెల్ఫోన్ను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దౌల్తాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో దౌల్తాబాద్ గ్రామంలో డి.కశప్ప రాత్రి సమయంలో తన ఇంట్లో నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి తన సెల్ఫోన్ను చోరీ చేయడం జరిగిందన్నారు. ఈ విషయంపైన దౌల్తాబాద్ ఎస్సై రమేశ్కు ఫిర్యాదు చేశారు. ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా సీఈఐఆర్ వెబ్ సైట్లో నమోదు చేయడంతో… 24 గంటల్లోనే ఆ సెల్ఫోన్ ఆచూకీని కనుగొన్నారు. సెల్ఫోన్ను జిల్లా అదనపు ఎస్పీ మురళీధర్ చేతుల మీదుగా బాధితుడికి అందజేశారు.