ఇబ్రహీంపట్నం/ ఇబ్రహీంపట్నంరూరల్, జనవరి 1 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో నూతన సంవత్సరం వేడుకలు అంబరాన్నంటాయి. 2022కు బాయ్..బాయ్… చెబుతూ.. నూతన సంవత్సరం 2023కు స్వాగతం పలికారు. శనివారం అర్ధరాత్రి నుంచే నూతన సంవత్సర వేడుకల్లో యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మెట్ మండలాలతో పాటు ఇబ్రహీంపట్నం, తుర్కయాంజాల్, పెద్దఅంబర్పేట, ఆదిబట్ల మున్సిపాలిటీల్లో నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డిని ఇబ్రహీంపట్నంలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం ఉదయం నుంచి ఎమ్మెల్యేను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలందజేసి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాల్లో మహిళలు, యువతులు ఇంటిముందు ముగ్గులు వేసి అందంగా అలంకరించారు. నూతన సంవత్సరం సందర్భంగా పెద్ద ఎత్తున కేక్లు కట్చేసి సంబురాల్లో పాల్గొన్నారు. అలాగే, పెద్ద ఎత్తున దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
2022కు బై బై
షాద్నగర్టౌన్ : 2022 సంవత్సరానికి బైబై చెబుతూ 2023 నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ న్యూ ఇయర్ వేడుకలను ప్రజలు సంతోషంతో జరుపుకొకున్నారు. పట్టణంలోని వేంకటేశ్వరస్వామి దేవాలయం, శివమారుతిగీతా అయ్యప్ప మందిరం, కన్యకాపరమేశ్వరి దేవాలయం, ఫరూఖ్నగర్ మండలం ఉత్తర రామలింగేశ్వరస్వామి దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. రామలింగేశ్వరస్వామికి భక్తులు ప్రత్యేక అభిషేకాలను నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి దర్శనం కోసం క్యూలో వేచియున్నారు. ట్రాఫిక్ పోలీసులు పట్టణ ముఖ్యకూడలితో పాటు పలు రహదారు వద్ద రాత్రి నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు విస్తృతంగా నిర్వహించారు. పట్టణ ముఖ్యకూడలిలో ఏసీపీ కుషాల్కర్, మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, సీఐ నవీన్కుమార్ పోలిసులతో, 108సిబ్బంది, ఎస్ఓటీ పోలీసుల, మున్సిపల్ కార్మికులతో కలిసి కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
కొత్త ఏడాది .. ఫుల్లు రద్దీ
పెద్దఅంబర్పేట : కొత్త సంవత్సరానికి ఆదివారం కూడా కలిసి రావడంతో రద్దీ చాలా ఎక్కువగా ఉన్నది. ఇటీవల కాలంలో ఇంత రద్దీని నేనెప్పుడూ చూడలేదు’ అని ఓ రెస్టారెంట్ నిర్వాహకుడు పేర్కొన్నాడు. అర్ధరాత్రి దాకా ఇదే రద్దీ ఉంటుందని అంచనా వేశాడు. కొంతమంది ఫోన్లలో ముందుగానే సీట్లు బుక్ చేసుకున్నారని తెలిపాడు. రెస్టారెంట్లు, హోటళ్లలో రద్దీ పెరుగడంతో చాలామంది పార్సిళ్లకు ప్రాధాన్యం ఇచ్చారు. పార్సిళ్లతో వన భోజనాలకు ప్లాన్ చేసుకున్నారు.
ఆలయాల్లో భక్తుల సందడి
చేవెళ్లటౌన్ : నూతన సంవత్సరం సందర్భంగా చేవెళ్లలోని లక్ష్మీవేంకటేశ్వరస్వామి, దేవాలయంతో పాటు అయ్యప్ప స్వామి, శివాలయం, కొనగట్టు బ్రహ్మగిరి క్షేత్రంలో భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు.
ఆమనగల్లు : మండలంలోని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. అనంతరం అలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. పట్టణంలోని కట్టమైసమ్మ అమ్మవారికి పంచామృతాభిషేకం, చక్రనవవర్ణార్చన, విశేష కుంకుమ పూజ, శ్రీ లక్ష్మీ పూజ, వేద పారాయణ, హోమాలు నిర్వహించారు
కడ్తాల్ : మండల వ్యాప్తంగా యువకులు కేక్లు కట్ చేసి, పెద్ద ఎత్తున పటాకులు కాల్చారు. కాలనీలలో డీజే సౌండ్లు ఏర్పాటు చేసి డ్యాన్స్లు చేస్తు కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. ఎమ్మెల్యే జైపాల్యాదవ్ని పలువురు ప్రజాప్రతినిధులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించారు.