కడ్తాల్, మే 2 : సబ్బండ వర్ణాల సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి అన్నా రు. రాష్ట్ర ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికుల వేతనాన్ని మరో రూ. వెయ్యి పెంచడాన్ని హర్షిస్తూ మంగళవారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట సర్పంచ్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి పారిశుద్ధ్య కార్మికులు, ప్రజాప్రతినిధులు క్షీరాభిషేకం చేశారు. అనంతరం లక్ష్మీనర్సింహారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఉద్యోగులు, నిరుపేదల పక్షపాతి అని..
ఇచ్చిన మాటను కచ్చితంగా నిలబెట్టుకుంటారని కొనియాడారు. నిరంతరం ప్రజాసేవలో తరించే పారిశుద్ధ్య కార్మికుల వేతనాన్ని పెంచడం సంతోషకరమన్నారు. హైదరాబాద్ నగరం నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతోపాటు రాష్ట్ర సచివాలయానికి బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టిన సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఆనంద్, ఉప సర్పంచ్ రామకృష్ణ, రైతుబంధు సమితి గ్రామాధ్యక్షుడు నర్సింహ, నాయకు లు జహంగీర్అలీ, వెంకటయ్యగౌడ్, రామచంద్రయ్య, నాగార్జున్, రవి, జంగయ్య, గణేశ్, సురేశ్ పాల్గొన్నారు.
మంచాలలో..
మంచాల, మే 2 : పారిశుద్ధ్య కార్మికుల వేతనాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.వెయ్యి పెంచడాన్ని హర్షిస్తూ మంగళవారం మండలంలోని చిత్తాపూర్ గ్రామపంచాయతీ సిబ్బంది సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ నాగరాజుగౌడ్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రభుత్వం అం డగా ఉంటూ వేతనాలను పెంచుతున్నదన్నారు. కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.