సిటీబ్యూరో, జనవరి 13 (నమస్తే తెలంగాణ): సంక్రాంతి సందర్భంగా సొంత ఊర్లకు వెళ్లే వారితో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు రద్దీగా మారాయి. ఈ క్రమంలో కరోనా ముప్పు పొంచి ఉన్నదని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. బీఎఫ్7అనే ఒమిక్రాన్ ఉప వేరియంట్ అలజడి సృష్టిస్తున్నప్పటికీ ఇప్పటి వరకైతే ఎక్కడ కూడా కేసుల తీవ్రత పెద్దగా కనిపించడం లేదు. అయినప్పటికీ వైరస్కు వ్యాప్తి గుణం అధికంగా ఉండడం వల్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు తెలుపుతున్నారు.
వైరస్తో పెద్ద ప్రమాదం లేనందున ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేనప్పటికీ పోస్ట్ కరోనా ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం పొంచి ఉన్నదని గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు హెచ్చరించారు.