కేశంపేట(మే 16) : బాలికను మోసపూరితంగా వివాహం చేసుకున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ప్రవీణ్కుమార్ తెలిపారు. ఎస్ఐ కథనం ప్రకారం..రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాపిరెడ్డిగూడ గ్రామానికి చెందిన మైనర్(12)ను తనకు వరుసకు బావ అయిన ఫరూఖ్నగర్ మండలం వెలిజర్లకు చెందిన పసమోని రవి(35) అనే వ్యక్తి ఈ నెల 13న మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరు లేని సమయం చూసి బలవంతంగా ఎత్తుకెళ్లి వెలిజర్లలో వివాహం చేసుకున్నాడు.
వివాహం తరువాత ఎలాగో వెలిజర్ల నుంచి తప్పించుకుని బాలిక తల్లిదండ్రుల వద్దకు చేరింది. జరిగిన విషయాన్ని ఎవరికి చెప్పుకోలేక భాధపడుతూ.. సోమవారం గ్రామ అంగన్వాడీ టీచర్ ఇస్లావత్ లక్ష్మికి జరిగిన విషయాన్ని చెప్పింది. ఆమె బాలికను తీసుకుని ఐసీడీఎస్ సూపర్వైజర్ విజయలక్ష్మితో కలిసి కేశంపేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ సంఘటనపై వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. బాలికను హైదరాబాద్లోని స్టేట్ హోంకు తరలిస్తామని సూపర్వైజర్ విజయలక్ష్మి తెలిపారు.