వికారాబాద్ : బహిరంగంగా మద్యం తాగిన ముగ్గురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వికారాబాద్ సీఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ అనంతగిరి అటవీ ప్రాంతంలో బహిరంగంగా మద్యం తాగుతున్న హైదరాబాద్కు చెందిన ముగ్గురు వ్యక్తులను ఆదివారం పట్టుకున్నట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం సేవించిన వారిపై కేసు నమోదు చేశామన్నారు. ఈ ముగ్గురిని సోమవారం ఉదయం కోర్టులో హాజరు పరుస్తున్నట్లు తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా మద్యం తాగితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అనంతగిరిలో నలుగురికి జరిమానా
వికారాబాద్ సమీపంలో ఉన్న అనంతగిరి అటవీ ప్రాంతంలో బహిరంగంగా మద్యం తాగిన నలుగురు వ్యక్తులకు జరిమానా విధించినట్లు వికారాబాద్ ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ అరుణ తెలిపారు. ఆదివారం హైదరాబాద్కు చెందిన ముగ్గురు వ్యక్తులు, వికారాబాద్ ప్రాంతానికి చెందిన మరో వ్యక్తి కలిసి నిబంధనలకు విరుద్దంగా మద్యం తాగారు. వీరికి రూ.4వేల జరిమానా విధించినట్లు తెలిపారు.