సిటీబ్యూరో, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): దేశంలో ప్రతియేటా 14 లక్షల క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని, అందులో 8 లక్షల వర కు మరణాలు వెలుగు చూస్తున్నాయని కిమ్స్ దవాఖాన ఎండీ డాక్టర్ భాస్కర్రావు అన్నారు.
ప్రపంచ క్యాన్సర్ నివారణ దినాన్ని పురస్కరించుకొని కిమ్స్ దవాఖానలో శనివారం వ్యాధిపై అవగాహనతోపాటు జీహెచ్ఎంసీ మహిళా కార్మికులు 400 మందికి ఉచితంగా క్యాన్సర్ స్క్రీ నింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ భాస్కర్రావు, డాక్టర్ రఘురాం మాట్లాడుతూ..50 ఏండ్లు దాటిన మహిళలు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలని సూచించారు. ఏటా దేశంలో 2 లక్షల వర కు రొమ్ము క్యాన్సర్ కేసులు నమోదవుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక పేర్కొన్నట్లు వారు చెప్పారు. మహిళలు అప్రమత్తంగా ఉండేందుకే ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ర్యాలీ తీసి.. చైతన్యపరిచి..
తెలుగు యూనివర్సిటీ, ఫిబ్రవరి 4: ప్రపంచ క్యా న్సర్ నివారణ దినాన్ని పురస్కరించుకొని ఎంఎన్జే వైద్య సిబ్బంది పలు బస్తీల్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఖైరతాబాద్ బస్తీలో ఎం ఎన్జే డైరెక్టర్ డాక్టర్ జయలత, వైద్యులు శ్రీ కాంత్, నదీమ్ నేతృత్వంలో.. విజయ్నగర్ కాలనీలో ఆర్ఎంవో డాక్టర్ నిర్మల, వైద్యులు విష్ణుప్రియ, అరుణ చైతన్య, కృష్ణల నేతృత్వంలో.. బంజారాహిల్స్ పోచమ్మ దేవాలయం సమీపంలో వైద్యులు విశాల్, వెన్నెల, రాధికాకృష్ణ ఆధ్వర్యం లో క్యాన్సర్ అవగాహన ర్యాలీ తీసి.. నినాదాలు చేస్తూ ప్లకార్డులతో ప్రజలను చైతన్య పరిచారు. అనంతరం ఖైరతాబాద్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో క్యాన్సర్ వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను విద్యార్థులు, అధ్యాపకులు, ఉద్యోగులకు వివరించి అవగాహన కల్పించారు.
నిమ్స్లో..
ప్రపంచ క్యాన్సర్ నివా రణ దినాన్ని పురస్కరించుకుని నిమ్స్ దవాఖానలో అవగాహన వాక్ నిర్వహించారు. ఈ వాక్ను నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప, మెడికల్ ఆకాలజీ విభాగాధిపతి డాక్టర్ సదాశివుడుతో కలిసి ప్రారంభించారు. డాక్టర్ బీరప్ప మాట్లాడుతూ మానవాళికి నేడు క్యాన్సర్ వ్యాధి సవాల్గా మారిందని, ప్రపంచదేశాలను చుట్టుముడుతున్న క్యాన్సర్పై కలిసికట్టుగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. పేద, మధ్యతరగతి ప్రజల కోసం తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యాన్ని అందిస్తున్నద న్నారు. డాక్టర్ సదాశివుడు మాట్లాడుతూ నిమ్స్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉం దని, ఈ వ్యాధిని జయించాలంటే చికిత్సపాటు మ నోధైర్యం ఉండాలన్నారు. నిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణ, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణారెడ్డి, సర్జికల్ ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ రాజశేఖర్, పాథాలజీ విభాగాధిపతి డాక్టర్ శాంతవీర్, నిమ్స్ అనుసంధానాధికారి డాక్టర్ మార్త రమేశ్ పాల్గొన్నారు.