నల్లగొండ రూరల్, ఏప్రిల్ 24 : నల్లగొండ పట్టణంలోని కాలనీలు టీఆర్ఎస్ పాలనలోనే అభివృద్ధి చెందాయని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని 26వ వార్డు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా రహమాన్బాగ్, ఎస్సీ కాలనీ ప్రాంతాల్లో ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 30న జరుగనున్న ఎన్నికల్లో వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి అసియా సుల్తానా బషీరొద్దిన్కు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. వార్డులో ప్రత్యేకంగా ఇప్పటికే సీసీ రోడ్లు వేయడంతోపాటు, శానిటేషన్కు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పిల్లి రామరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ బొర్ర సుధాకర్, నీరంజన్వలీ, అభిమన్యు శ్రీనివాస్, ఫరుదుద్దీన్, జమాల్ ఖాద్రి, మోహన్, ఇబ్రహీం, ఎస్కే ముస్తాఫా, గణేశ్ పాల్గొన్నారు.