గంటకో మాట, పూటకో వేషం వేస్తూ ఊళ్లలోకి వస్తున్న బీజేపీ, కాంగ్రెస్ నాయకులను ప్రజలు నమ్మవద్దని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. పోచమ్మతల్లి మీద, ఎల్లమ్మతల్లి మీద ఒట్టు పెట్టుకుని మాయ మాటలు చెప్పే నాయకుల హామీలు నీటి మీద రాతలేనని విమర్శించారు. గుమ్మడిదల మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన్ను నాయకులు, కార్యకర్తలు రథంపై ఊరేగిస్తూ స్వాగతం పలికారు. అనంతరం సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ దేశంలో కీ రోల్ పోషించనున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ అడుగుల్లో అడుగులు వేస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నానని చెప్పారు. తాను చేస్తున్న అభివృద్ధి ప్రతిపక్షాలకు కడుపు మంటగా మారిందన్నారు.
గుమ్మడిదల, మార్చి 29: బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలతో గులాబీ జాతర సాగుతున్నది. ఊరూవాడ, పట్టణాల నుంచి ప్రజలు సమ్మేళనాల్లో పాల్గొని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ను మద్దతు తెలుపుతున్నారు. బుధవారం గుమ్మడిదల మండలంలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఆధ్వర్యంలో చంద్రారెడ్డిగార్డెన్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి కార్యకమంలో రైతులు, కార్మికులు, మహిళా సంఘాలు, యువజన సంఘాలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉదయం 11 గంటలను అన్నారం నుంచి ప్రారంభమైన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల బైక్ ర్యాలీ 4వేల మంది యువకులతో నిర్వహించారు. ర్యాలీలో గులాబీపూలతో అడుగడుగునా పూలవర్షం కురిపించారు. ఎమ్మెల్యేను మండల నాయకులు భారీ గజమాలతో సత్కరించారు. అనంతరం గుమ్మడిదల- కానుకుంట చౌరస్తాలో బీఆర్ఎస్ జెండాను ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఎగురవేశారు. కొత్తపల్లి, నల్లవల్లి తండా మహిళలు లంబాడి నృత్యాలు చేసి తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాన్ని చాటారు. ఇందులో ఎంపీపీ సద్దిప్రవీణారెడ్డి, ఎంపీటీసీ కొత్తపల్లి ప్రభాకర్రెడ్డి వారితో పాటు నృత్యాలు చేశారు. అనంతరం జరిగిన సభలో మైనార్టీలు, వివిధ కులసంఘాలు, మహిళా సంఘాలు ఎమ్మెల్యేను శాలువా పూలమాలతో సన్మానించారు. బీఆర్ఎస్ మండల నాయకులు గులాబీపూలతో ఎమ్మెల్యేను సన్మానించారు.
పెద్ద ఎత్తున ప్రజలు హాజరుకావడంపై ఎమ్మెల్యే వారికి శిరస్సువంచి ధన్యవాదాలు తెలిపారు. కార్యకమంలో గుమ్మడిదల జడ్పీటీసీ చిన్నపాపని కుమార్గౌడ్, మండలాధ్యక్షుడు మహ్మద్ హుస్సేన్, సీనియర్ నాయకులు గోవర్ధన్రెడ్డి, సద్దివిజయభాస్కర్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, నరేందర్రెడ్డి, నక్క వెంకటేశ్, రైతు సంఘం కో-ఆర్డినేటర్ సంజీవరెడ్డి, యువనత నాయకుడు మడపతి చంద్రశేఖర్, సర్పంచ్లు చిమ్ముల నర్సింహారెడ్డి, ఆలేటి అనవీనాశ్రీనివాస్రెడ్డి, మమతావేణు, రాజశేఖర్, కంజర్ల శ్రీనివాస్, శంకర్, ఆంజనేయులు, దీపానరేందర్రెడ్డి, రేణుకస్వామి, వాసవీదామోదర్రెడ్డి, గుమ్మడిదల ఎంపీపీ సద్దిప్రవీణారెడ్డి, ఎంపీటీసీలు రాజ్యలక్ష్మి, పద్మాకొండల్రెడ్డి, మండల నాయకులు నరహరి, శేఖర్గౌడ్, టీ.రాజు, గౌరీశంకర్గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ నంద్యాల విష్ణువర్దర్రెడ్డి, రైతు సంఘం నాయకుడు మద్దుల బాల్రెడ్డి, దేశబోయిన కుమార్, మొగులయ్య, అమ్మన్నగారి శేఖర్, వినోద్గౌడ్, చక్రపాణి, దాసరి ఆంజనేయులు, రవికాంత్రెడ్డి, ఫయాజ్షరీఫ్, గరీబ్, షరీఫ్, రఫీక్, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
– ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి
దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంతో పాటు పటాన్చెరు నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి జోడు గుర్రాలపై స్వారీ చేస్తున్నాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. గతంలో గుమ్మడిదల ఒక మేజర్ గ్రామపంచాయతీ. ఇప్పుడు కొత్త మండలంగా మారిందని, ఇందంతా తెలంగాణ రాష్ట్రం వచ్చాకే సాధ్యమైందని తెలిపారు. పూటకో వేషం వేస్తూ ప్రజల ముందుకు వస్తున్న కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాయమాటలు నమ్మొద్దని నియోజకవర్గ ప్రజలకు సూచించారు. కానుకుంట-గుమ్మడిదల సింగిల్ రోడ్డుకు కేంద్ర ప్రభుత్వం మరమ్మతుల కోసం రూ.కోటి 70 లక్షలు మంజూరు చేస్తే తాను ఏకంగా రూ.7.50 కోట్లతో జీవీఆర్ ఎంటర్ప్రైజెస్తో డబుల్ రోడ్డు వేయిస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ అడుగులో అడుగు వేస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గంలోని పలు పారిశ్రామికవాడలో 25 రాష్ట్రల యువకులు ఉద్యోగాలు చేస్తున్నారు. వారు కూడా తెలంగాణ బిడ్డలే, వారికి కూడా తెలంగాణలో అమలయ్యే ప్రతి సంక్షేమ పథకం వర్తిస్తుందన్నారు. మూడోసారి భారీ మెజార్టీతో బీఆర్ఎస్కు విజయమందించాలని ప్రతి ఓటరుకూ శిరస్సు వంచి నమస్కరిస్తున్నామన్నారు.
సీఎం కేసీఆర్లో మా పెద్దకొడుకును చూసుకుంటున్న. నాకు నెలనెలా పింఛన్ వస్తున్నది. దీంతోనే బతుకుతున్న. ఇలాంటి నాయకుడిని ఎప్పుడూ చూడలేదు. మంచి పాలన అందించడంలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ముందున్నారు. వారితోనే అభివృద్ధి జరుగుతున్నాయి.
– లక్మిమి, కొత్తపల్లి తండా, మహిళ
సీఎం కేసీఆర్ మా పాలిట దేవుడని కంగ్టి మండలం సర్ధార్తండాకు చెందిన చిమ్నీబాయి అన్నారు. ఆత్మీయసమ్మేళనంలో ఆమె మాట్లాడుతూ గతంలో మా తండాలో కనీస వసతులు లేవని, తాగునీటికోసం కిలోమీటర్ల మేర నడిచి వెళ్లి తీసుకొచ్చేవాళ్లమన్నారు. ఉప ఎన్నికల్లో భాగంగా మంత్రి హరీశ్రావు మాతండాలో పర్యటించినప్పుడు తాగునీటి సమస్యను అడిగి తెలుసుకుని, పదిహేనురోజుల్లో నీటి వసతిని కల్పించాడని తెలిపారు. తండాలో త్రీఫేజ్ కరెంట్ సరఫరా చేసేలా చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. మరోమారు రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ఇందుకోసం ప్రతిఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని కోరారు.