చేవెళ్లటౌన్, అక్టోబర్ 6: దసరా పండుగ సందర్భంగా చేవెళ్ల వైస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్, ఊరేళ్ల సర్పంచ్ జహంగీర్, నాయకులు గురువారం నగరంలోని మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్రెడ్డిలను వారి నివాసంలో కలిసి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. వారిని కలిసిన వారిలో ఊరేళ్ల ఉప సర్పంచ్ విఠలయ్య, నాయకులు ఉన్నారు.
చేవెళ్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో..
చేవెళ్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే యాదయ్యను టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నాయకులు కలిసి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మిట్టవెంకటరంగారెడ్డి, వైస్ ఎంపీపీ శివప్రసాద్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నర్సింహులు, సర్పంచ్ జంహగీర్, ఉప సర్పంచ్ విఠలయ్య, నాయకులు భూపతిరెడ్డి ఉన్నారు. రైతుబంధు సమితి అధ్యక్షుడు నాగార్జునరెడ్డి ఎమ్మెల్యే యాదయ్యకు శుభాకాంక్షలు తెలిపారు.
ఎలిమినేడులో..
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని టీఆర్ఎస్(బీఆర్ఎస్) నాయకులు, కార్యకర్తలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వైస్ఎంపీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్చైర్మన్లు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డిని ఎలిమినేడులోని తన వ్యవసాయ క్షేత్రంలో కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ను దేశవ్యాప్తంగా పటిష్టం చేసేందుకు అందరం కలిసికట్టుగా పనిచేద్దామని ఎమ్మెల్యే కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో ఎంపీపీలు కృపేశ్, నర్మద, వైస్ఎంపీపీలు వెంకటప్రతాప్రెడ్డి, మార్కెట్కమిటీ మాజీ చైర్మన్ వెంకటరమణారెడ్డి, మున్సిపల్ వైస్చైర్మన్లు ఆకుల యాదగిరి, కోరె కళమ్మ, మండల పార్టీల అధ్యక్షుడు బుగ్గరాములు, రమేశ్గౌడ్, రమేశ్, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు భరత్రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు ఉన్నారు.
చెడుపై గెలుపునకు ప్రతీక దసరా
చెడుపై గెలుపునకు దసరా పండుగ ప్రతీకగా నిలుస్తుందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. టీఆర్ఎస్ నాయకుడు దేవేందర్యాదవ్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ నాయకులు ఎమ్మెల్యేను ఎక్లాస్కాన్పేటలోని ఆయన స్వగృహంలో గురువారం కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీకి చెందని టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నాయకులు ఎమ్మెల్యేకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. వీరి వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ రవీందర్, ఎంపీటీసీ రాజేందర్గౌడ్, టీఆర్ఎస్(బీఆర్ఎస్) నాయకులు జనార్దనాచారి, యాదయ్య, ఆంజనేయులుగౌడ్, శివకుమార్, వెంకటేశ్, రవీనాయక్, శ్రవణ్, రాఘవేందర్, ప్రవీణ్ ఉన్నారు.
మంత్రిని కలిసిన మొయినాబాద్ నేతలు
మంత్రి పి.సబితారెడ్డిని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు నగరంలోని ఆమె నివాసంలో నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో బీఆర్ఎస్ నాయకులు నర్సింహారెడ్డి, రవీందర్రెడ్డి, కృష్ణారెడ్డి ఉన్నారు.